NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pune: పోర్స్చే కారు ప్రమాదం.. పోలీస్ స్టేషన్‌లో మైనర్ కి పిజ్జా, బర్గర్.. పోలీసులపై ఆరోపణలు 
    తదుపరి వార్తా కథనం
    Pune: పోర్స్చే కారు ప్రమాదం.. పోలీస్ స్టేషన్‌లో మైనర్ కి పిజ్జా, బర్గర్.. పోలీసులపై ఆరోపణలు 
    పోలీస్ స్టేషన్‌లో మైనర్ కి పిజ్జా, బర్గర్.. పోలీసులపై ఆరోపణలు

    Pune: పోర్స్చే కారు ప్రమాదం.. పోలీస్ స్టేషన్‌లో మైనర్ కి పిజ్జా, బర్గర్.. పోలీసులపై ఆరోపణలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2024
    01:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పూణేలో 17 ఏళ్ల యువకుడు నడుపుతున్న పోర్స్చే కారు గుద్దుకుని ఇద్దరు వ్యక్తులు మరణించిన కేసులో పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

    ఇద్దరు వ్యక్తులను కారుతో ఢీకొట్టి హతమార్చిన 14 గంటల లోపే ఆ యువకుడికి బెయిల్ మంజూరైంది.

    దీని తర్వాత, పోలీసు స్టేషన్‌లో యువకుడికి పిజ్జా, బర్గర్‌లు కొన్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

    శివసేన (UBT) నాయకుడు సంజయ్ రావత్ పూణే పోలీస్ కమీషనర్ అమితేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.

    మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ NCP విభాగానికి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా 17 ఏళ్ల యువకుడికి సహాయం చేశారని ఆరోపించారు.

    Details 

    ప్రమాదంలో ఇంజనీర్లు అనీష్ అవధ్యా, అశ్విని కోస్తా మృతి

    పూణెలోని కోరేగావ్ పార్క్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు,యువతి,యువకుడు ప్రాణాలు కోల్పోయారు.

    మధ్యప్రదేశ్‌కు చెందిన ఇంజనీర్లు అనీష్ అవధ్యా, అశ్విని కోస్తా మృతి చెందారు.

    ప్రముఖ బిల్డర్‌కు చెందిన 17 ఏళ్ల కుమారుడు నడుపుతున్న పోర్షే కారు వారు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది.

    ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అశ్విని అక్కడికక్కడే మృతి చెందగా, అవధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

    ఈ ఘటనలో 17 ఏళ్ల తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. 17 ఏళ్ల యువకుడు ప్లస్ టూ ఉత్తీర్ణత వేడుకలు ముగించుకుని తన స్నేహితులతో కలిసి కారులో బార్ నుంచి తిరిగి వస్తున్నాడు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది.

    Details 

    బాలుడికి జువైనల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు

    ఈ కేసులో నిందితుడైన బాలుడికి జువైనల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది.

    ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది.

    మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Bangladesh: శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్   బంగ్లాదేశ్
    WTC Final 2025: చరిత్ర సృష్టించిన పాట్‌ కమిన్స్‌.. రికార్డుల మీద రికార్డులు పాట్ కమిన్స్
    Aircraft Accidents:  భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు,నష్టాలు ఇవే..! విమానం
    Air india Flight Crash: విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి  గుజరాత్

    మహారాష్ట్ర

    Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం అగ్నిప్రమాదం
    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం
    NCP MLA Jitendra Awhad: "రాముడు మాంసాహారి" ..NCP నేత వివాదాస్పద వ్యాఖ్యలు భారతదేశం
    Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అరెస్ట్ సల్మాన్ ఖాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025