Purendeswari: విజయసాయి రెడ్డి భూ దోపిడీకి పాల్పడుతున్నారు.. బెయిల్ రద్దు చేయండి: సీజేఐకి పురందేశ్వరి లేఖ
వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీజేఐకి లేఖ రాశారు. విజయసాయి రెడ్డి ప్రజలను బెదిరిస్తూ అనేక నేరాలకు పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించారు. విజయసాయిరెడ్డి వైజాగ్లోని పలు ప్రాంతాల్లో భూములు ఆక్రమించారని, ఆయనతో పాటు ఆయన అల్లుడు నేరాల్లో భాగస్వాములుగా ఉన్నారని ప్రచారం జరుగుతోందని ఆమె లేఖలో పేర్కొన్నారు. కడప నుంచి విజయసాయిరెడ్డి గూండాలను రప్పించారని, విశాఖలో పలుచోట్ల భూములు లాక్కున్నారని పురంధేశ్వరి అన్నారు. వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు కూడా విజయసాయిరెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు.