NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Shakur Khan: పాక్ కోసం 'గూఢచర్యం' చేసిన ప్రభుత్వ ఉద్యోగికి మాజీ మంత్రితో సంబంధాలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Shakur Khan: పాక్ కోసం 'గూఢచర్యం' చేసిన ప్రభుత్వ ఉద్యోగికి మాజీ మంత్రితో సంబంధాలు 
    పాక్ కోసం 'గూఢచర్యం' చేసిన ప్రభుత్వ ఉద్యోగికి మాజీ మంత్రితో సంబంధాలు

    Shakur Khan: పాక్ కోసం 'గూఢచర్యం' చేసిన ప్రభుత్వ ఉద్యోగికి మాజీ మంత్రితో సంబంధాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 29, 2025
    04:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి షకూర్ ఖాన్‌ను పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసినట్లు అనుమానంతో బుధవారం రాత్రి జైసల్మేర్‌లో నిఘా అధికారుల బృందం అరెస్ట్ చేసింది.

    గత కొన్ని వారాలుగా అతనిపై విచారణాధికారులు నిశితంగా నిఘా ఉంచినట్టు వెల్లడించారు.

    షకూర్ ఖాన్‌ పాక్ దౌత్య కార్యాలయంతో సంబంధాలు కలిగి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

    ఈ ఆధారాలతోనే అతడిని అరెస్ట్ చేశామని జైసల్మేర్‌ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ చౌదరి తెలిపారు.

    అతడి ఫోన్‌ను పరిశీలించిన అధికారుల బృందం, అందులో పలు పాకిస్తానీయుల ఫోన్ నంబర్లు ఉన్నట్టు గుర్తించింది.

    వాటి గురించి అడిగిన ప్రశ్నలకు షకూర్ సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేకపోయాడని సమాచారం.

    వివరాలు 

    మొబైల్‌లో కీలక ఫైల్స్ డిలీట్ అయినట్లు గుర్తింపు 

    ఇకపోతే అతడు ఇప్పటివరకు ఏకంగా ఏడు సార్లు పాకిస్తాన్‌కు ప్రయాణించినట్టు రికార్డుల ద్వారా తేలింది.

    అతడి మొబైల్ ఫోన్‌ పరిశీలనలో కొన్ని ఫైల్స్ డిలీట్ అయినట్లుగా గుర్తించారని అధికారులు వెల్లడించారు.

    అంతేకాకుండా, అతని బ్యాంకు ఖాతాలపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇటీవల అతడి ఒక ఖాతా మూసివేసినట్లు గుర్తించి, దానిపైన ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు.

    ఇదిలా ఉండగా, షకూర్ ఖాన్‌కు రాజస్థాన్ మాజీ మంత్రి షేల్ మొహమ్మద్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.

    ఓ సమయంలో ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసినట్టు అధికారులు వెల్లడించారు.

    షేల్ మొహమ్మద్, కాంగ్రెస్ ప్రభుత్వంలో అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

    షకూర్,షేల్ మొహమ్మద్ గ్రామాలు కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉండేవని గుర్తించారు.

    వివరాలు 

    సోషల్ మీడియాలో షకూర్ ఖాన్, షేల్ మొహమ్మద్,ఘాజీ ఫకీర్‌లతో కలసి ఉన్న ఫోటోలు

    షేల్ మొహమ్మద్ రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినట్టు రికార్డులు పేర్కొంటున్నాయి.

    స్థానికుల కథనం ప్రకారం,షకూర్ ఖాన్ తరచూ షేల్ మొహమ్మద్ తండ్రి ఘాజీ ఫకీర్‌ను కలిసేవాడని తెలిపారు.

    ఇక సోషల్ మీడియాలో షకూర్ ఖాన్, షేల్ మొహమ్మద్,ఘాజీ ఫకీర్‌లతో కలసి ఉన్న ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.

    ఘాజీ ఫకీర్ 2021లో మృతి చెందారు. మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పోలీసులు,నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

    జైసల్మేర్ ప్రాంతాన్ని బహుళ భద్రతతో నిఘా పరిధిలోకి తీసుకొచ్చారు.

    ఇక్కడ అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఆరుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    వివరాలు 

    పాక్ పౌరులకు ఇచ్చే వీసాల రద్దు

    వారితో పాటు ఏడవ వ్యక్తిగా షకూర్ ఖాన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ సుధీర్ చౌదరి తెలిపారు.

    ఇదే సమయంలో, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది భారతీయులను హత్యచేసిన ఘటన చోటుచేసుకుంది.

    ఈ దారుణ ఘటనకు ప్రతిస్పందనగా భారత్ పలు కఠిన చర్యలు చేపట్టింది.

    పాకిస్తాన్‌కు సరఫరా చేస్తున్న సింధు నదీ జలాలను నిలిపివేసింది. పాక్ పౌరులకు ఇచ్చే వీసాలను రద్దు చేసింది.

    అటారీ సరిహద్దును మూసివేసింది. అంతేకాకుండా, మే 7న "ఆపరేషన్ సిందూర్" పేరుతో పాక్‌పై బలమైన దాడి జరిపింది.

    ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమవ్వడమే కాకుండా, పాకిస్తాన్ వైమానిక స్థావరాలు కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు భారత అధికార వర్గాలు వెల్లడించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్

    తాజా

    Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు అమరావతి
    Ola Roadster X: ఓలా రోడ్‌స్టర్ ఎక్స్.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రేంజ్ ఓలా
    WhatsApp: వాట్సాప్ స్టేటస్‌లో నాలుగు సరికొత్త ఫీచర్లు.. యూజర్లకు మరింత సౌకర్యం! వాట్సాప్
    Bandi Sanjay: 'కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామానే'.. బండి సంజయ్ ఫైర్ బండి సంజయ్

    రాజస్థాన్

    PM Modi: 10 ఏళ్లలో ఏం జరిగిందో అది కేవలం ట్రైలర్ మాత్రమే.. ఇంకా చాలా చేయాల్సి ఉంది: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్: జైపూర్ మ్యాచ్​ లో పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లీ అభిమాని ముంబై
    Kota Fire: కోట హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది విద్యార్థుకు గాయలు  భారతదేశం
    Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. స్పాట్‌లో ఏడుగురు మృతి రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025