NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / INDIA alliance: ఇండియా కూటమిలో విభేదాలు..శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..  
    తదుపరి వార్తా కథనం
    INDIA alliance: ఇండియా కూటమిలో విభేదాలు..శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..  
    ఇండియా కూటమిలో విభేదాలు..శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..

    INDIA alliance: ఇండియా కూటమిలో విభేదాలు..శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 10, 2025
    04:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమి మధ్య విభజనకు కారణమయ్యాయి.

    2024 లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన విపక్షాలు, బీజేపీకి మెజారిటీ సాధించకుండా అడ్డుకున్నప్పటికీ, అధికారంలోకి రాకుండా మాత్రం కాదని చెప్పవచ్చు.

    బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న 400 సీట్లు కేవలం 240 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాయి.

    అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం మరోసారి ఇండియా కూటమి పనితీరుపై అనుమానాలను లేవనెత్తింది.

    జార్ఖండ్‌లో కాంగ్రెస్ చిన్న పార్టీలో మాత్రమే ఉన్నా, అక్కడ జెఎంఎం (హేమంత్ సోరెన్ పార్టీ) ఎక్కువ సీట్లు గెలిచింది. అయినప్పటికీ, ఓట్ల శాతంలో బీజేపీ అన్ని పార్టీల కంటే ముందుంది.

    వివరాలు 

    కీలకంగా మారిన  సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

    ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల విషయానికి వస్తే, ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.

    ఎంపీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పటికీ, బీజేపీ ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది.

    అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నాయి.

    అలాగే, కాంగ్రెస్‌కు బదులుగా, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ వంటి పార్టీలు ఆప్‌కి మద్దతు అందిస్తున్నాయి.

    ఈ పరిణామంలో, శివసేన ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

    వివరాలు 

    ఇండియా కూటమి ఉనికి మీద అనుమానాలు

    "లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మంచి ఫలితాలు సాధించాం. కానీ, ఇండియా కూటమి ఉనికి కోసం ఒక్క సమావేశం కూడా జరగలేదు" అని అన్నారు.

    ఆయన ప్రకారం, ఒమర్ అబ్దుల్లా, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు అందరూ ఇప్పుడు ఇండియా కూటమి ఉనికి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    "ప్రజల మనస్సులో ఈ భావన ఏర్పడితే, కూటమిలోని అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ దీనికి బాధ్యులుగా నిలుస్తుంది. సమన్వయం లేకపోవడం, చర్చలు లేకపోవడం వల్ల ఇండియా కూటమి ఉనికి మీద అనుమానాలు వస్తున్నాయి. ఒకసారి విడిపోయిన తర్వాత కూటమి మళ్లీ ఇంకెప్పటికీ కలవదని ఆయన జోస్యం చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంజయ్ రౌత్‌

    తాజా

    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు
    Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే! భారత జట్టు

    సంజయ్ రౌత్‌

    Sanjay Raut: 'సామ్నా'లో ప్రధాని మోదీపై 'అభ్యంతరకరమైన' కథనం..సంజయ్ రౌత్‌పై కేసు భారతదేశం
    Sanjay Raut: పరువు నష్టం కేసులో సంజయ్ రౌత్‌కు కోర్టు 15 రోజుల జైలు శిక్ష   ముంబై
    Sanjay raut: ఎన్నికల సంఘం సహాయంతో బీజేపీ ఓటర్ల జాబితా తారుమారు చేస్తోంది..  సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు  భారతదేశం
    Sanjay Raut: షిండే శకం ముగిసింది.. మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025