
Security Drills: 31కి వాయిదా పడి భద్రతా దళాలు సెక్యూరిటీ డ్రిల్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ నెల 31వ తేదీన సాయంత్రం,పాకిస్థాన్తో సరిహద్దు కలిగిన జిల్లాల్లో భద్రతా బలగాలు ప్రత్యేక భద్రతా అభ్యాసాలు(సెక్యూరిటీ డ్రిల్స్)నిర్వహించనున్నాయి.
ఈ కవాతులు గుజరాత్,పంజాబ్,హర్యానా, రాజస్థాన్,జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో జరగనున్నాయి.
సరిహద్దు అవతల నుంచే ముప్పు ఏర్పడే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని,అక్కడి ప్రజలకు తగిన అవగాహన కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితులపట్ల స్థానికుల సహకారాన్ని పెంచడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
ప్రధమంగా ఈ భద్రతా వ్యాయామాలు గురువారం రోజున నిర్వహించాలనుకొన్నారు.
అయితే పరిపాలన సంబంధిత కొన్ని కారణాల వల్ల ఈ డ్రిల్స్ను వాయిదా వేయాల్సి వచ్చింది.
పాకిస్థాన్ వైపు నుండి ఇటీవల నాలుగు రోజులపాటు తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో, 'ఆపరేషన్ షీల్డ్'లో భాగంగా ఈ ప్రత్యేక డ్రిల్స్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
31కి వాయిదా పడి భద్రతా దళాలు సెక్యూరిటీ డ్రిల్స్
🚨Govt of India announces new date for #OperationShield mock drill - May 31.
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 29, 2025
~ Strategic readiness drill to cover J&K, Punjab, Rajasthan, Gujarat, Haryana & Chandigarh along western border.
Prepared for all Possibilities 👏🏼 pic.twitter.com/q8bdoZOvlK