NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Shashi Tharoor:కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో శశిథరూర్‌ సెల్ఫీ.. పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు బలం  
    తదుపరి వార్తా కథనం
    Shashi Tharoor:కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో శశిథరూర్‌ సెల్ఫీ.. పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు బలం  
    కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో శశిథరూర్‌ సెల్ఫీ.. పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు బలం

    Shashi Tharoor:కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో శశిథరూర్‌ సెల్ఫీ.. పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు బలం  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 25, 2025
    12:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పార్టీని వీడే అవకాశముందని కొద్దిరోజులుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఆయన తీసుకున్న వైఖరిని శశిథరూర్‌ ప్రశంసించడం, అలాగే సీపీఎం ప్రభుత్వ విధానాలను మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు కారణంగా మారాయి.

    తాజాగా, శశిథరూర్‌ సోషల్‌ మీడియాలో చేసిన ఒక పోస్ట్‌ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.

    భారత్-యూకే వాణిజ్య ఒప్పందంపై చర్చల అనంతరం,కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌, బ్రిటన్‌ సెక్రటరీ ఆఫ్ ట్రేడ్ జోనాథన్ రేనాల్డ్స్‌లతో కలిసి ఉన్న ఫోటోను ఆయన షేర్‌ చేశారు.

    ఇరుదేశాల మధ్య కొంతకాలంగా నిలిచిపోయిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు పునఃప్రారంభమైనట్లు పేర్కొంటూ,ఇది మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

     బీజేపీలో చేరతారనే వార్తలు 

    వారిని కలవడం సంతోషంగా అనిపించిందని వెల్లడించారు. గత కొద్దిరోజులుగా శశిథరూర్‌ వ్యవహారం కాంగ్రెస్‌కు దూరమవుతున్నట్లు కనిపిస్తోందని పలు మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

    త్వరలో ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

    ప్రధానమంత్రి మోదీకి మద్దతుగా అమెరికా పర్యటన సమయంలో ఆయన మాట్లాడటాన్ని కూడా ఈ ప్రచారానికి ఉదాహరణగా చూపిస్తున్నారు.

    అయితే, ఈ వార్తలను కాంగ్రెస్‌ నాయకత్వం ఖండించింది. పార్టీ ప్రయోజనాలను మాత్రమే కాదు, దేశ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

    అంతేకాక, తాను సీపీఎం ప్రభుత్వ విధానాలను మెచ్చుకోలేదని, కేరళలో స్టార్టప్ రంగంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించానని శశిథరూర్‌ స్పష్టం చేశారు.

    వివరాలు 

    నా ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలు

    శశిథరూర్‌ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి ఒక సందేశం ఇచ్చారు.

    ''పార్టీకి నా అవసరం లేకుంటే చెప్పండి. నా ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పార్టీ నన్ను కోరుకుంటే నేను అందుబాటులో ఉంటాను. లేకుంటే నాకు పుస్తకాలు, ప్రసంగాలు, అంతర్జాతీయ సదస్సుల కోసం ఎన్నో ఆహ్వానాలు ఉన్నాయి. సమయాన్ని ఉపయోగించుకునేందుకు నాకు వేరే అవకాశాలు లేవనుకోవద్దు'' అని వ్యాఖ్యానించారు.

    ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, ఆయన త్వరలోనే పార్టీ మారతారనే ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శశిథరూర్
    పీయూష్ గోయెల్‌

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    శశిథరూర్

    Shashi Tharoor: ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?: కళ్లు చెదిరే సమాధానం చెప్పిన శశిథరూర్ భారతదేశం
    Shashi Tharoor vs Rajeev Chandrasekhar : "అభివృద్ధిపై చర్చిద్దాం".. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సవాల్‌ను స్వీకరించిన శశిథరూర్ రాజీవ్ చంద్రశేఖర్
    Delhi:ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్.. శశి థరూర్ పీఏ అరెస్ట్  దిల్లీ
    Shashi Tharoor: 'కాలుష్యం తీవ్రమవుతున్నందున ఢిల్లీ భారత రాజధానిగా ఉండాలా..?' శశిథరూర్‌ పోస్ట్‌ వైరల్‌ భారతదేశం

    పీయూష్ గోయెల్‌

    సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్  బ్రిక్స్ సమ్మిట్
    పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ రాజ్యసభ
    Tesla : భారత్‎లోకి టెస్లా.. పీయూష్‌ గోయల్‌తో మస్క్‌ భేటీ ఎప్పుడో తెలుసా టెస్లా
    Piyush Goyal: ఎగ్జిట్ పోల్ తర్వాత భారతీయ పెట్టుబడిదారులు లాభాలు పొందారు,రాహుల్‌కి ఏమీ తెలియదు;బీజేపీ ఎదురుదాడి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025