NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?

    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?

    వ్రాసిన వారు Stalin
    May 04, 2023
    07:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సాయుధ గుంపులు ఇళ్లకు నిప్పు పెట్టాయి.

    రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు, రక్తపాతాలు జరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పరిస్థితులను అదుపులోకి తేచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు.

    ఇంఫాల్ లోయలోని మైతైలు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న కుకీ తెగల మధ్య ఘర్షణ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది.

    అయితే ఈ రెండు వర్గాల మధ్య హింసకు 1970లోనే బిజం పడింది. మణిపూర్‌లో బుధవారం నాటి హింసతో ప్రభావిత జిల్లాల్లో సైన్యం, అస్సాం రైఫిల్ సిబ్బందిని ప్రభుత్వం మోహరించింది.

    రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను రాబోయే ఐదు రోజుల పాటు నిలిపివేసింది.

    మణిపూర్

    మణిపూర్‌ భౌగోళిక సర్వూరం 

    మణిపూర్‌లో 16 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర భూభాగాన్ని ఇంఫాల్ లోయ, కొండ జిల్లాలుగా విభజించారు.

    ఇంఫాల్ లోయలో ఐదు జిల్లాలు ఉన్నాయి. ఇందులో హిందువులు, మైతైల ఆధిపత్యం ఉంటుంది.

    కొండ జిల్లాలలో నాగా, కుకి తెగల ఆధిపత్యం ఉంటుంది. తాజాగా అత్యధిక హింసకు గురైన చురచంద్‌పూర్ కొండ జిల్లాల్లో ఒకటి.

    ఇక్కడ కుకీలు లేదా నాగ క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. నాలుగు కొండ జిల్లాల్లో కుకీల మెజార్టీ సంఖ్యలో ఉంటారు. రాష్ట్ర మొత్తం జనాభాలో 53శాతం మంది మైతైలు ఉన్నారు.

    అయితే రాష్ట్రంలో వారి ఆధీనంలో కేవలం 10శాతం భూమి ఉంటడంపై కొన్నేళ్లుగా మైతైలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    మణిపూర్ 35 తెగలు ఉండగా, వాటిలో మెజార్టీ వాటా కుకీలదే కావడం గమనార్హం.

    మణిపూర్

    తాజా హింసకు కారణం ఇదే

    షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలన్న మైతై కమ్యూనిటీ అభ్యర్థనను నాలుగు వారాల్లోగా పరిశీలించాలని మణిపూర్ హైకోర్టు ఏప్రిల్ 20న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    ఈ సిఫార్సును కేంద్రం పరిశీలనకు పంపాలని కోర్టు కోరింది. మైతై కమ్యూనిటీని ఎస్టీ కేటగిరీలో చేర్చడాన్ని నిరసిస్తూ కుకీ తెగకు చెందిన సంస్థలు బుధవారం 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించాయి.

    ఈ యాత్ర తర్వాతే హింస చెలరేగింది.

    అభివృద్ధి చెందిన మైతైలు ఎస్టీ హోదా ఎలా పొందుతారని గిరిజన నాయకులు ప్రశ్నిస్తున్నారు.

    వారికి ఎస్టీ హోదా వస్తే తమ భూమి అంతా తీసుకుంటారని ఆల్ మణిపూర్ ట్రైబల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కెల్విన్ నెహ్సియాల్ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

    మణిపూర్

    మైతై వర్గం ఏం చెప్పిందంటే?

    మణిపూర్‌లో చెలరేగిన హింసపై మైతై వర్గం కూడా తమ వాదనను వినిపించింది.

    కుకీ తెగ చేస్తున్న నిరసనలు ఎస్టీ హోదాకు వ్యతిరేకంగా కాదని మైతై వర్గం నాయకులు అంటున్నారు.

    ఎస్టీ హోదా ముసుగులో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియకు అడ్డం పడుతున్నట్లు చెబుతున్నారు.

    ప్రస్తుతం మణిపూర్ అంతటా అక్రమ వలసదారులను గుర్తించే డ్రైవ్ కొనసాగుతోందని ఆల్ మైతై కౌన్సిల్ సభ్యుడు చాంద్ మీటే పోచ్‌షాంగ్‌బామ్ అన్నారు.

    ఇది కుకీలకను కలవరపాటు గురి చేస్తోందని ఆయన చెప్పారు.

    మణిపూర్

    ఒక్కసారిగా పెరిగిన జనాభా, ఎన్‌ఆర్‌సీకి డిమాండ్

    దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 1951ని బేస్ ఇయర్‌గా పరిగణించి ఎన్‌ఆర్‌సీని అమలు చేయాలని ఈ ఏడాది మార్చిలో పలు మణిపురి సంస్థలు నిరసనకు దిగాయి.

    జనాభా పెరుగుదలలో జాతీయ సగటు 17.64 శాతానికి కంటే మణిపూర్‌లో అత్యధికంగా 24.5 శాతం వృద్ధి రేటు ఉండటంపై మైతై యూనియన్లతో పాటు మరికొన్ని సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.

    జనాభా వృద్ధి రేటు పెరుగుదల సహజంగా జరగలేదని, పొరుగు దేశాల నుంచి వచ్చిన వలసల వల్లే ఈ స్థాయిలో జనాభా పెరిగినట్లు ఆయా సంస్థలు అనుమానిస్తున్నాయి.

    కుకీలు మయన్మార్ సరిహద్దు నుంచి అక్రమంగా వలస వచ్చి మణిపూర్‌లోని అటవీ భూమిని ఆక్రమిస్తున్నారని ఆల్ మెయిటీ కౌన్సిల్‌కు చెందిన చాంద్ మీటే పోక్‌షాంగ్‌బామోఫ్ చెప్పారు.

    మణిపూర్

    1970 నుంచి మయన్మార్ నుంచి పెరిగిన వలసలు

    మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలుగా అకస్మాత్తుగా జనాభా పెరుగుదల నమోదైనట్లు మైతై వర్గం చెబుతోంది.

    ముఖ్యంగా మయన్మార్ నుంచి అక్రమ వలసదారులు 1970ల నుంచి రావడం ప్రారంభించారు. వచ్చిన వారు మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో స్థరపడుతూ వచ్చారు.

    మణిపూర్ ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అక్రమ నివాసాలను తొలగించడానికి ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టినట్లు ఆల్ మైతై కౌన్సిల్‌కు చెందిన చాంద్ మీటే పోక్‌షాంగ్‌బామోఫ్ అన్నారు.

    ఈ డ్రైన్ కేవలం కుకీలు నివసిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే జరగడం లేదని, మైతైలు, ముస్లింలు నివసించే చోట్ల కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరి కుకీలు మాత్రమే ఎందుకు నిరసన తెలుపుతున్నారని ప్రశ్నించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నా రాష్ట్రాన్ని ఆదుకోండి: మోదీని కోరిన మేరీ కోమ్

    My state Manipur is burning, kindly help @narendramodi @PMOIndia @AmitShah @rajnathsingh @republic @ndtv @IndiaToday pic.twitter.com/VMdmYMoKqP

    — M C Mary Kom OLY (@MangteC) May 3, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    తాజా వార్తలు
    ఆర్మీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    మణిపూర్

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్

    తాజా వార్తలు

    అదరగొట్టిన ఆర్సీబీ బౌలర్లు; 18పరుగుల తేడాతో లక్నోపై విజయం  బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య దిల్లీ
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    కాంగ్రెస్ మేనిఫెస్టో: ఉచిత విద్యుత్, రూ.3వేల నిరుద్యోగ భృతి, కుటుంబ పెద్దకు రూ.2వేలు కర్ణాటక

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా చైనా
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025