NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: TCSకు 21.6 ఎకరాల భూమి కేటాయించిన ఎపి ప్రభుత్వం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: TCSకు 21.6 ఎకరాల భూమి కేటాయించిన ఎపి ప్రభుత్వం 

    Andhra Pradesh: TCSకు 21.6 ఎకరాల భూమి కేటాయించిన ఎపి ప్రభుత్వం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 15, 2025
    05:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)కు కేవలం 99 పైసల ధరకు 21.6 ఎకరాల భూమిని కేటాయించింది.

    ఈ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఏప్రిల్ 15న సమావేశమై అంగీకారం తెలిపింది.గుజరాత్ ప్రభుత్వం ఇటీవల టాటా మోటార్స్‌కు 99 పైసలకు భూమిని కేటాయించిన నేపథ్యంలో,ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ తాజా అభివృద్ధి ప్రాధాన్యత సంతరించుకుంది.

    విశాఖపట్టణం నగరంలోని ఐటీ హిల్-3 ప్రాంతంలో TCSకు 21.66 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు,ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 3.5 ఎకరాల భూమిని కేటాయించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    రాష్ట్రానికి అధిక స్థాయిలో ఐటీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

    వివరాలు 

    రాష్ట్ర ప్రభుత్వం, TCS మధ్య చర్చలు 

    విశాఖపట్నంను ఒక సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.

    ఈ కేబినెట్‌ సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించగా, పలు కీలక నిర్ణయాల మధ్య ఈ భూ కేటాయింపుల అంశం ప్రాధాన్యత పొందింది.

    గత ఏడాది అక్టోబర్ 2024లో నారా లోకేశ్ ముంబైలో టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్థాయిలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయమని TCSను ఆహ్వానించారు.

    ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, TCS మధ్య కొనసాగిన చర్చల ఫలితంగా ఈ రోజు ఈ భూమిని కేటాయించడంపై అంగీకారం వెలువడింది.

    వివరాలు 

     కంపెనీలకు రాష్ట్రంపై నమ్మకం పెరిగేలా.. 

    ఈ నేపథ్యంలో, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా తదుపరి పెద్ద కేంద్రంగా ఎదగనున్నదని,దీనివల్ల పెట్టుబడిదారులకు రాష్ట్రంలోని వనరులతో పాటు ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుందని స్పష్టం చేశారు.TCSకు ఇచ్చిన ఈ ఆఫర్ ద్వారా ఇతర కంపెనీలకు రాష్ట్రంపై నమ్మకం పెరిగేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

    ఇప్పటికే గుజరాత్‌లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, సనంద్‌ ప్రాంతంలో టాటా మోటార్స్‌కు 99 పైసలకు భూమి కేటాయించగా, అది ఆ రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ ఆటో మొబైల్ కేంద్రంగా మారేందుకు దోహదపడింది. అలాగే, టాటా ఎలక్ట్రానిక్స్‌కు గుజరాత్‌ ప్రభుత్వం ధోలేరాలో విస్తరణ కోసం అవసరమైతే 63 ఎకరాల భూమిని అందిస్తామని హామీ ఇచ్చింది.

    వివరాలు 

    టెక్ రంగంలో ప్రత్యేకమైన స్థానం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం 

    ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో ముందుకు సాగుతూ, టెక్ రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

    అయితే వైజాగ్‌లో టిసిఎస్ చేపట్టబోయే కార్యకలాపాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

    తాజా

    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్

    ఆంధ్రప్రదేశ్

    AP: ఆంధ్రప్రదేశ్'లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే..25 లక్షల మంది రెడీ..!  భారతదేశం
    AP Govt: 93వేల కుటుంబాలకు లబ్ధి.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! చంద్రబాబు నాయుడు
    Engineering: ఇంజినీరింగ్ విద్యలో నూతన అధ్యాయం.. క్వాంటం కంప్యూటింగ్ చేరిక! భారతదేశం
    Weather Report: ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు తెలంగాణ

    టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

    భారీ లాభాలను ప్రకటించిన టెక్ దిగ్గజం టీసీఎస్.. ఇకపై కంపెనీలో అలా చేస్తామంటే కుదరదని స్పష్టం  బిజినెస్
    జనరేటివ్ ఏఐలో ట్రైనింగ్ కోసం టీసీఎస్ పెట్టుబడులు.. లక్ష మంది ఉద్యోగులకు సాంకేతిక నైపుణ్య శిక్షణ  బిజినెస్
    TCS scam: లంచాలకు ఉద్యోగాల స్కామ్.. 16మందిని తొలగించిన టీసీఎస్  ఉద్యోగులు
    Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ  పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025