
Telangana Statehood Day: తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈరోజుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి.రాష్ట్రం 12వ యేట అడుగుపెడుతోంది.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఈ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు తమ శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ అభివృద్ధి మార్గంలో రాష్ట్ర ప్రజలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ద్రౌపది ముర్ము చేసిన ట్వీట్
Warm greetings to the people of Telangana on Statehood Day! This young State has a rich cultural heritage and a vibrant modern ecosystem of economic and technological development. I wish that the people of Telangana march ahead on the path of progress and prosperity.
— President of India (@rashtrapatibhvn) June 2, 2025
వివరాలు
దేశ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర
ఇక ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.
రాష్ట్రానికి మెరుగైన అభివృద్ధి కల్పించేందుకు ఎన్డీయే ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా ఇతర ప్రముఖ నాయకులు కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశాలు షేర్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
Greetings to the wonderful people of Telangana on their Statehood Day. The state is known for making innumerable contributions to national progress. Over the last decade, the NDA Government has undertaken many measures to boost ‘Ease of Living’ for the people of the state. May…
— Narendra Modi (@narendramodi) June 2, 2025