NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు 
    తదుపరి వార్తా కథనం
    Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు 
    సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు

    Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 23, 2024
    12:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సంధ్య థియేటర్‌ ఘటన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని భావిస్తున్నారు.

    ఈ అంశంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రచారంలో భాగంగా ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డిని కలుస్తామని తెలిపారు.

    ఈ సమావేశంలో టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.

    వివరాలు 

    సంక్రాంతికి 'డాకూ మహారాజ్'

    అంతేకాదు, బాలకృష్ణ ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'డాకూ మహారాజ్'ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ సన్నాహాలు చేస్తున్నారు.

    సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు బాబీ, నాగవంశీ పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా పరిశ్రమ పరిస్థితులపై మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటనపై జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని అడగ్గా, సినిమా విడుదల సమయంలో అన్ని చోట్ల పర్యవేక్షణ సాధ్యం కాకపోయినా, భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

    తెలుగు చిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌కు మార్చాలని వస్తున్న ఊహాగానాలపై స్పందించిన నాగవంశీ, తాను హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకున్నానని, మరో రాష్ట్రానికి మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

    వివరాలు 

    సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు

    పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమాలకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తోందని అభిప్రాయపడ్డారు.

    ఇదే సమయంలో, సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన కారణంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సినిమాలకు టికెట్ ధరలు పెంచకుండా, ప్రీమియర్ షోల అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించడంతో చిత్ర పరిశ్రమలో కలకలం చెలరేగింది.

    సంక్రాంతి వంటి ముఖ్యమైన సీజన్‌కు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ నిర్ణయం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

    ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు, ఇతర మినహాయింపులపై చర్చించేందుకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు సీఎం రేవంత్‌ రెడ్డిని కలవాలని నిర్ణయించారు.

    ఈ సంధర్భంలో దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి వచ్చాక, తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రేవంత్ రెడ్డి

    CM Revanth Delhi Tour: మెట్రో ఫేజ్​2కు సహకరించాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మనోహర్ లాల్ ఖట్టర్
    Telangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం తెలంగాణ
    Hyderabad: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్‌ పెంపే ప్రభుత్వ లక్ష్యం  తెలంగాణ
    Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం 60 రోజుల్లో నివేదిక.. జాబ్‌ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025