NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా?
    తదుపరి వార్తా కథనం
    పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా?
    పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా?

    పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా?

    వ్రాసిన వారు Stalin
    Jun 23, 2023
    11:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజకీయాలో కీలక పరిణామంగా భావించే ప్రతిపక్ష నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు నేతలు శుక్రవారం బిహార్ రాజధాని పాట్నకు చేరుకున్నారు.

    రాజకీయ పార్టీలే కాకుండా దేశం మొత్తం ఈ సమావేశంపై అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

    బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆతిథ్యం ఇవ్వనున్నఈ సమావేశం బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో కీలకంగా మారుతుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.

    2024 సార్వత్రిక ఎన్నికలకు ఇది మంచి పరిణామంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.

    ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, శరద్ పవార్, మెహబూబా ముఫ్తీ, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు హాజరయ్యారయ్యేందుకు పాట్నకు చేరుకున్నారు.

    బిహార్

    ఇదొక చారత్రక సమావేశం: జేడీయూ 

    రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌదరి ప్రతిపక్ష నేతల సమావేశానికి హాజరు కావడం లేదు.

    కుటుంబ కార్యక్రమాల వల్ల హాజరు కావడం లేదని నితీష్ కుమార్‌కు ఆయన గురువారం లేఖ రాశారు. పాట్నలో జరుగుతున్న ఈ కాన్‌క్లేవ్‌ను చారిత్రక సమావేశంగా జేడీయూ నేత, బిహార్ మంత్రి విజయ్ చౌదరి అభివర్ణించారు.

    ఎందుకంటే ఇటువంటి సమావేశంలో గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. బీజేపీపై పోరాటానికి ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) రూపొందించాల్సిన అవసరాన్ని బిహార్ కాంగ్రెస్ చీఫ్ అఖిలేష్ ప్రసాద్ సింగ్ నొక్కి చెప్పారు.

    వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోటీ చేస్తే, బీజేపీ సంఖ్య 100 కంటే తక్కువ సీట్లకు తగ్గుతుందని పేర్కొన్నారు.

    బిహార్

    ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించేది ఎవరు?

    పాట్న సమ్మేళనం బీజేపీని ఎదుర్కోవడానికి ఐక్య ప్రయత్నంగా భావిస్తున్నప్పటికీ, దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

    ప్రధానమంత్రి పదవి ఎవరిది అనే విషయంతో పాటు, సీట్ల పంపకం ప్రతిపక్ష పార్టీలకు ఆందోళన కలిగించే అంశం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా సీట్లలో ఆ పార్టీకే మద్దతిస్తామని తృణమూల్ గతంలోనే ప్రకటించింది.

    మరోవైపు నాయకత్వం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తృణమూల్ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ పేర్కొన్నారు.

    అయితే విపక్షాల సమావేశాన్ని వ్యర్థమైన కసరత్తుగా బీజేపీ కొట్టిపారేసింది. అవకాశవాద కూటమి ఎటువంటి ఫలితాలను ఇవ్వదని పేర్కొంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పాట్నకు చేరుకున్న శరద్ పవార్

    #WATCH | Nationalist Congress Party (NCP) chief Sharad Pawar reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting pic.twitter.com/H8f9UtCOiK

    — ANI (@ANI) June 23, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాట్న
    బిహార్
    నితీష్ కుమార్
    తాజా వార్తలు

    తాజా

    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ
    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక తెలంగాణ

    పాట్న

    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ  లోక్‌సభ
    పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్ బిహార్
    బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం బిహార్

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ

    నితీష్ కుమార్

    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ బీజేపీ
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?  బిహార్

    తాజా వార్తలు

    తమిళనాడులో భారీ వర్షాలు; పాఠశాలలు మూసివేత తమిళనాడు
    తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం తెలంగాణ
    బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు  బైజూస్‌
    భూగర్భ జలాలను భారీగా తోడటంతో 80 సెం.మీ వంగిన భూమి  భూమి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025