NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirupati laddu news: మరో వివాదంలో తిరుపతి లడ్డూ.. లడ్డూలో పొగాకు గుట్కా కవర్.. ఆరోపణపై టీటీడీ క్లారిటీ
    తదుపరి వార్తా కథనం
    Tirupati laddu news: మరో వివాదంలో తిరుపతి లడ్డూ.. లడ్డూలో పొగాకు గుట్కా కవర్.. ఆరోపణపై టీటీడీ క్లారిటీ
    మరో వివాదంలో తిరుపతి లడ్డూ.. లడ్డూలో పొగాకు గుట్కా కవర్

    Tirupati laddu news: మరో వివాదంలో తిరుపతి లడ్డూ.. లడ్డూలో పొగాకు గుట్కా కవర్.. ఆరోపణపై టీటీడీ క్లారిటీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 24, 2024
    02:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో ఆవు కొవ్వు కలపడం గురించి ఇటీవల వచ్చిన వార్తలు భక్తులను కలవరపరిచాయి.

    ఈ వార్తల నేపథ్యంలో, అనేక మంది భక్తులు వేంకటేశ్వరస్వామి ఆలయ పరిపాలనపై ఆందోళన వ్యక్తం చేశారు.

    తాజాగా మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది, అందులో ఒక మహిళా భక్తురాలు తనకు లడ్డూ ప్యాకెట్‌లో గుట్కా ప్యాకెట్ కనిపించిందని వీడియో ద్వారా తెలియజేసింది.

    వివరాలు 

    సంఘటన వివరాలు 

    తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లా కొల్లగూడెం ప్రాంతానికి చెందిన పద్మావతి అనే మహిళా భక్తురాలు తిరుపతి ఆలయంలో లడ్డూ కొనుగోలు చేసినప్పుడు, అందులో గుట్కా ప్యాకెట్ ఉన్నట్లు చెప్పారు.

    ఆమె ఈ విషయాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వీడియో వైరల్ అయ్యింది.

    ఈ సంఘటనపై తిరుపతి దేవస్థానం స్పందించి, విచారణ జరిపేందుకు కొల్లగూడెం వెళ్లనుందని సమాచారం.

    వివరాలు 

    గత నివేదికలు 

    ఇదిలా ఉండగా, గతంలో కూడా లడ్డూ తయారీలో నెయ్యిలో జంతు కొవ్వు కలిపారన్న ఆరోపణలు వచ్చాయి.

    చంద్రబాబు నాయుడు ఆ ఆరోపణలను బహిరంగంగా చేయగా, గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ నిర్వహించిన పరిశీలనలో వాటికి సమర్థన లభించింది.

    అందులో, నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, పోర్క్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వంటి పదార్థాలు ఉండటం తేలింది.

    ఈ నేపథ్యంలో, లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన దిండిగల్ కంపెనీని దేవస్థానం బోర్డు బ్లాక్‌లిస్టులో చేర్చింది.

    వివరాలు 

    దర్యాప్తు చర్యలు 

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం కర్ణాటక ప్రభుత్వ సంస్థ నందిని నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తోంది.

    లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడినట్లు విచారణలో తేలిన తర్వాత,ఆలయంలో శాంతి హోమం నిర్వహించి,పరిసరాలను శుద్ధి చేశారు.

    అర్చకులు భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వామివారి దర్శనానికి విచ్చేయవచ్చని తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లడ్డూలో గుట్కా ప్యాకెట్ 

    Amber (Tobacco/Gutka) cover is found in Tirumala Laddu Prasada
    Please don't play with sentiments of the devotees 🙏🙏🙏#TirupatiLaddu #Tirumalapic.twitter.com/8Z4CnN3hk2

    — ಕನ್ನಡ ಡೈನಾಸ್ಟಿ (@Kannadadynasty) September 24, 2024

    వివరాలు 

    ఆరోపణపై టీటీడీ క్లారిటీ

    తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన సమాచారం. టీటీడీ ప్రకారం,సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు.

    లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందని జరుగుతున్నప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టత ఇచ్చారు.

    పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు ఉందని కొన్ని వదంతులు వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది.

    తిరుమలలో లడ్డూ తయారీ చాలా భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల చేత ప్రతిరోజూ లక్షలాది లడ్డూలు తయారవుతాయని వివరించారు.

    ఇంకా, ఈ లడ్డూ తయారీ పూర్తిగా సీసీటీవీ పర్యవేక్షణలో జరుగుతుందని అన్నారు.

    ఇలాంటి కఠినమైన నిబంధనలు ఉండే వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గుర్తించాలని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి
    ఖమ్మం

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీ
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి హిందువులు

    ఖమ్మం

    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025