NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pakistani Nationals: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..
    తదుపరి వార్తా కథనం
    Pakistani Nationals: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..
    పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..

    Pakistani Nationals: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 29, 2025
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం తారాస్థాయికి చేరింది.

    ఈ పరిస్థితుల్లో భారత్‌లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

    అలాగే, నిర్దేశిత గడువు లోపల పాకిస్తాన్ పౌరులు భారత్‌ను వదిలి వెళ్లాలని ఆదేశించింది.

    పాకిస్తాన్ పౌరులు భారత్‌ను వీడేందుకు ఇవాళ అంటే ఏప్రిల్ 29 చివరి రోజు కాగా, మెడికల్ వీసాలతో దేశంలో ఉన్న వారికీ ఇదే గడువు వర్తించనుంది.

    వారు దేశం విడిచిపెట్టకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

    ఈ నేపథ్యంలో భారతదేశం నలుమూలలా ఉన్న పాక్ పౌరులు తమ స్వదేశానికి తిరుగుతున్నారు.

    వివరాలు 

    పాక్ పౌరులను పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు

    ఈ క్రమంలో, కేంద్రం ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.

    హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్‌లో నమోదు అయిన పాకిస్తాన్ పౌరుల వివరాలను అధికారులు పూర్తిగా పరిశీలించారు.

    డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రంలో ఉన్న పాక్ పౌరులను పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

    హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులు గడువులోగా తమ దేశానికి వెళ్లాలని, లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

    ఇప్పటికే హైదరాబాద్‌ను నలుగురు పాకిస్తానీయులు వదిలి వెళ్లారు. వారిలో ఒక పురుషుడు, ఒక మహిళ, ఆమె కుమార్తెతో పాటు మరో మహిళ కూడా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పహల్గాం ఉగ్రవాద దాడి

    తాజా

    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  16 మంది  మృతి  చార్మినార్

    పహల్గాం ఉగ్రవాద దాడి

    Pahalgam Terror Attack: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.. వాటి వివరాలివే భారతదేశం
    Pahalgam Attack video: పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్త వీడియో.. తెలీకుండానే రికార్డ్‌ చేసిన టూరిస్ట్‌!  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025