
Pune: పూణెలో కూలిన శిక్షణా విమానం.. సురక్షితంగా బయటపడ్డ పైలట్
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే జిల్లా, బారామణి విమానాశ్రయం సమీపంలో ఒక శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎవరూ గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. రెడ్బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్కి చెందిన ఆ శిక్షణా విమానం,శిక్షణ పూర్తి చేసిన అనంతరం ల్యాండింగ్కు సిద్ధమవుతున్న సమయంలో పైలట్ టైర్లలో ఒకదానిలో లోపం ఉన్నట్లు గుర్తించాడు. ఈ పరిస్థితుల్లో ఆయన అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నించారు. అయితే ల్యాండింగ్ సమయంలో విమానం ముందు చక్రం విడిపోయింది. ఫలితంగా విమానం రన్వే నుండి పక్కకు వాలిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని,పైలట్ క్షేమంగా ఉన్నారని ఒక సీనియర్ పోలీస్ అధికారి వివరించారు.
వివరాలు
అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రమాదం
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఒక పెద్ద విమాన ప్రమాదం దేశాన్ని కలిచివేసింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే, ఆ విమానం ఎయిర్పోర్ట్ సమీపంలోని ఒక భవనంపై కూలిపోవడంతో 270 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానమే ఈ ప్రమాదానికి గురైంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఘటనపై సంబంధిత దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, చిత్రాలు
महाराष्ट्र के बारामती में ट्रेनिंग एयरक्राफ्ट का लैंडिंग के समय लैंडिंग गियर में आई दिक्कत..
— Vivek Gupta (@imvivekgupta) August 9, 2025
लैंडिंग गियर बाहर निकला..
पायलट सुरक्षित..#Maharashtra pic.twitter.com/h0htbhvztm