Savitri Thakur: స్కూల్ ఈవెంట్ లో "బేటీ పఢావో, బేటీ బచావో" నినాదాన్ని తప్పుగా రాసిన జూనియర్ మంత్రి
మధ్యప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ 'బేటీ పఢావో, బేటీ బచావో' అనే నినాదాన్ని తప్పుగా రాశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రతిపక్ష కాంగ్రెస్ మంత్రి సమర్థతపై ప్రశ్నలను లేవనెత్తింది. ధార్లోని బ్రహ్మ కుండిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం 'స్కూల్ చలో అభియాన్' కింద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధార్ సీటు నుంచి లోక్సభ సభ్యురాలు సావిత్రి ఠాకూర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సావిత్రి ఇటీవల కేంద్ర ప్రభుత్వంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస విద్యార్హతను నిర్ధారించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలి
వీడియోలో, మహిళా మంత్రి వైట్బోర్డ్పై దేవనాగరి లిపిలో 'బేటీ బచావో, బేటీ పఢావో' అనే నినాదాన్ని తప్పుగా రాస్తున్నట్లు కనిపిస్తోంది. వైరల్ వీడియోపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెకె మిశ్రా స్పందిస్తూ, "రాజ్యాంగ పదవులు, పెద్ద శాఖలకు బాధ్యత వహించే వ్యక్తులు వారి మాతృభాషలో కూడా సమర్థులు కాకపోవడం ప్రజాస్వామ్య దురదృష్టం,వారు తమ మంత్రిత్వ శాఖను ఎలా నడుపుతారు?"అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస విద్యార్హతను నిర్ధారించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారీ మీడియా సలహాదారు మిశ్రా మాట్లాడుతూ..'ఒకవైపు దేశ పౌరులు అక్షరాస్యులని చెబుతూనే మరోవైపు బాధ్యతగల వ్యక్తుల్లో అక్షరాస్యత కొరవడుతోందన్నారు.. ఇది ఒక వ్యక్తి గురించి కాదు, కానీ సిస్టమ్ సమస్య" అని అన్నారు.