NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / #Newsbytesexplainer: ప్ర‌కృతి వైప‌రీత్య‌మా.. మానవా తప్పిదామా.. ఎవరిది నేరం..?
    తదుపరి వార్తా కథనం
    #Newsbytesexplainer: ప్ర‌కృతి వైప‌రీత్య‌మా.. మానవా తప్పిదామా.. ఎవరిది నేరం..?
    ప్ర‌కృతి వైప‌రీత్య‌మా.. మానవా తప్పిదామా.. ఎవరిది నేరం..?

    #Newsbytesexplainer: ప్ర‌కృతి వైప‌రీత్య‌మా.. మానవా తప్పిదామా.. ఎవరిది నేరం..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 03, 2024
    08:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వర్షాకాలం జూన్‌లో ప్రారంభమవుతుంది. రైతులు ఆ సీజన్‌లో ఏదైనా వర్షం పడితే తక్షణమే పొలాన్ని దున్ని విత్తనాలు నాటుతారు.

    మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం, పంటలపైనే మన జీవనాధారం ఆధారపడుతోంది.

    పట్టణీకరణ ఎంతైనా వృద్ధి చెందుతున్నా, వ్యవసాయం దేశానికి ముఖ్య ఆధారం. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సహా యావత్ దేశం రుతుపవనాల కోసం ఎదురు చూస్తుంది.

    అయితే, వాతావరణ మార్పులు మనుగడపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎప్పటిలాగే వర్షాలు సమయానికి రాకపోవడం, క్షీణించిపోవడం మనం చూస్తున్న సత్యం.

    వీటికి కారణం మానవ ప్రవర్తనేనన్న చర్చ పర్యావరణ ప్రియుల మధ్య బలంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా వర్షాలు సక్రమంగా పడలేదు.

    వివరాలు 

    సెప్టెంబర్ మొదట్లో భారీ వర్షాల ప్రభావం

    కరువు పరిస్థితులు కనిపించడం, రైతులు పెట్టిన విత్తనాలు మొలకెత్తకుండానే ఎండిపోవడం వంటి దుర్భాగ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

    వాతావరణ శాఖ అధికారులు సీజన్ ఇంకా చాలా ఉందని, ఆగస్టు నాటికి భారీ వర్షాలు పడతాయని సూచించారు, ఆ తర్వాత నిజంగానే వర్షాలు మొదలయ్యాయి.

    అయితే, వర్షాలు కురవడం ద్వారా కొంత కాలం వ్యవసాయ పనులు నెమ్మదిగా ప్రారంభమైనా, సెప్టెంబర్ మొదట్లో భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా తాకింది.

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం అయ్యాయి. ఖమ్మం, విజయవాడ నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకుని తీవ్రంగా నష్టపోయాయి.

    వివరాలు 

    కబ్జాలకు గురైన చెరువులు 

    ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడం, అలాగే లకారం చెరువు కబ్జా చేయబడడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.

    విజయవాడ నగరంలో బుడమేరు వాగు కబ్జాలకు గురై వర్షపు నీటిని సరైన విధంగా తట్టుకోలేకపోవడం వల్ల నగరంలో వరద నీరు చుట్టూ వ్యాపించింది.

    హైదరాబాద్ నగరంలో సైతం చెరువులు కబ్జాలకు గురై క్రమంగా వడిగా మారుతున్నాయి.

    వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు ఇంటిలోకి చేరడం, రహదారులు నీటితో నిండడం సాధారణ విషయాలుగా మారాయి.

    పర్యావరణ ప్రేమికులు ప్రకృతి ధోరణులను మానవీయ చర్యల కారణంగా వ్యతిరేకిస్తున్నారని హెచ్చరిస్తున్నారు.

    వివరాలు 

    పట్టణాలు కాంక్రీటు జంగిళ్లుగా మారాయి

    అడవుల నరికివేత వల్ల వర్షపాతం తగ్గిపోవడం, వర్షాలు సమయానికి రాకపోవడం, నేలలో నీరు ఇమిడిపోకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.

    పట్టణాలు కాంక్రీటు జంగిళ్లుగా మారడంతో నీటికి గమ్యం లేకుండా ముంపులు సంభవిస్తున్నాయి.

    పాలకులు ఈ సమస్యలను సకాలంలో గుర్తించి చెరువులను పునరుద్ధరించడంతో పాటు అడవులను పెంచాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

    ఎప్పటికైనా మేలుకొంటేనే మనుగడ కొనసాగుతుందని వారంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరదలు
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్
    Shilpa shirodkar: కొవిడ్‌ బారిన పడిన బాలీవుడ్‌ నటి శిల్పా శిరోద్కర్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు  బాలీవుడ్

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు దిల్లీ

    ఆంధ్రప్రదేశ్

    Ram Mohan Naidu: ఏపీలో మరో 7 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తాం.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కేంద్రమంత్రి
    Eluru: ఏపీలో మరో దారుణం.. భర్తను చితకొట్టి, భార్యపై అత్యాచారం ఏలూరు
    Vasudeva Reddy : ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు సీఐడీ
    Digital Payments: పట్టణ స్థానిక సంస్థల్లో డిజిటల్ విధానం.. త్వరలోనే అమల్లోకి! ఇండియా

    తెలంగాణ

    Telangana: రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్  భారతదేశం
    Komatiteddy: విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్
    Telangana: వానాకాలంలో సాగు టార్గెట్ కోటి ఎకరాలు ఇండియా
    sunkishala project: సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు అంతర్జాతీయ నిపుణులు  ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025