NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అన్నామలై వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తు విచ్ఛిన్నం అవుతుందా?
    తదుపరి వార్తా కథనం
    అన్నామలై వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తు విచ్ఛిన్నం అవుతుందా?
    అన్నామలై వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తు విచ్ఛిన్నం అవుతుందా?

    అన్నామలై వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తు విచ్ఛిన్నం అవుతుందా?

    వ్రాసిన వారు Stalin
    Jun 13, 2023
    06:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

    మాజీ సీఎం జయలలితపై అన్నామలై పరోక్షంగా చేసిన విమర్శలు ఇప్పుడు బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు వారే పరిస్థితిని తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది.

    తమిళనాడులో 2024 లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ)కి 25+ సీట్లు సాధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యాన్ని నిర్దేశించిన మరుసటిరోజే బీజేపీ-ఏఐఏడీఎంకే మధ్య డైలాగ్ వార్ రెండు పార్టీల పొత్తు ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

    ఇంతకీ అన్నామలై చేసిన వివాదాస్పద కామెంట్స్ ఏంటి? నిజంగా జయలలితను ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేశారా? అన్నామలైపై ఏఐఏడీఎంకే నేతలు ఎలాంటి స్పందిస్తున్నారు?

    తమిళనాడు

    తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఏంటంటే? 

    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడ్డారంటూ అన్నామలై ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

    తమిళనాడు గతంలో అనేక అవినీతి పరిపాలనలను చూసిందని, మాజీ ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడి కోర్టుల్లో కూడా శిక్షించబడ్డారని అన్నారు. అలాగే తమిళనాడు అత్యంత అవినీతి రాష్ట్రంగా మారిందని అన్నారు.

    1991-96 మధ్య కాలం (జయలలిత అధికారంలో ఉన్నప్పుడు)లో అవినీతి అత్యంత దారుణమైన స్థితిలో ఉందని అన్నామలై చెప్పారు.

    అవినీతిలో ఈ పీరియడ్ నంబర్ వన్ అని అన్నామలై అన్నారు. అయితే తమిళనాడు మాజీ సీఎం జయలలిత అవినీతి కేసులో కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించారు.

    ఈ క్రమంలో అన్నామలై తమ 'ఇదయ దైవం' జయలలితపై పరోక్ష విమర్శలు చేశారని అన్నాడీఎంకే నిప్పులు చెరుగుతున్నారు.

    తమిళనాడు

    కూటమిని విచ్ఛిన్నం చేసే విధంగా పని చేస్తున్న అన్నామలై: జయకుమార్ 

    అన్నామలై కామెంట్స్ పై అన్నాడీఎంకే సీనియర్ నేత నేత డి.జయకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించకపోతే బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమి ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

    బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు పొన్‌ రాధాకృష్ణన్‌, తమిళిసై సౌందరరాజన్‌, మురుగన్‌ వంటి నేతలు పొత్తు ధర్మాన్ని పాటించారని, ఐక్యంగా ఉండేవారని, కానీ అన్నామలై మాత్రం బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమిని విచ్ఛిన్నం చేసే విధంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.

    అన్నామలై చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఖండిస్తారని భావిస్తున్నట్లు జయకుమార్ అన్నారు. లేకుంటే పొత్తు కొనసాగడం ప్రశ్నార్థకం అవుతుందని జయకుమార్ చెప్పారు.

    తమిళనాడు

    అన్నామలై వ్యాఖ్యలను ఖండిస్తూ ఏఐఏడీఎంకే తీర్మానం 

    అన్నామలై మాజీ ముఖ్యమంత్రి జయలలితపై పరోక్ష ఆరోపణల నేపథ్యంలో అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) కీలక నిర్ణయం తీసుకుంది. అన్నామలై వ్యాఖ్యలను ఖండిస్తూ పార్టీ తీర్మానం చేసింది.

    అన్నామలై పై ఏఐఏడీఎంకే కీలక నేత పన్నీర్‌సెల్వం మండిపడ్డారు. జయలలితపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతను తెలియజేస్తోందని అన్నారు.

    అన్నామలై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి అన్నారు.

    అతను కావాలనే ఈ వాఖ్యలు చేసినట్లు పళనిస్వామి పేర్కొన్నారు. అతని కామెంట్స్ పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, ఇది ఏఐఏడీఎంకే కార్యకర్తలను బాధించిందని చెప్పుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    బీజేపీ
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తమిళనాడు

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి భారతదేశం
    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి గవర్నర్

    ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే

    ఏఐఏడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదు, పూర్వ వైభవాన్ని తీసుకొస్తా: శశికళ తమిళనాడు
    తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం! తమిళనాడు
    Tamil Nadu: బీజేపీతో విభేదాలు ఉన్నా.. పొత్తు కొనసాగుతుంది: ఏఐఏడీఎంకే తమిళనాడు
    బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్ తమిళనాడు

    బీజేపీ

    నేడు బీజేపీలోకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి! ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు తమిళనాడు

    తాజా వార్తలు

    ఒడిశా: దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు; ప్రయాణికుల హడల్  రైలు ప్రమాదం
    కొత్త తరం లాంచ్ వెహికల్ కోసం మా బృందం పని చేస్తోంది: ఇస్రో చీఫ్ సోమనాథ్  ఇస్రో
    కెనడాలో చెలరేగిన కార్చిచ్చుతో తూర్పు అమెరికా బేజార్; న్యూయార్క్‌ను కమ్మేసిన పొగ  అమెరికా
    రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్‌‌పై అభియోగాలు; నేరం రుజువైతే 100ఏళ్ల జైలుశిక్ష  డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025