NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్ 
    రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్

    YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 03, 2025
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని తీవ్రమైన విమర్శలు చేశారు.

    రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనా వ్యవస్థలు నియంత్రణ కోల్పోతున్న నేపథ్యంలో, పోలీసు వ్యవస్థ ఎలా దిగజారిపోతోందో తెనాలి ఘటన స్పష్టంగా చూపుతోందని వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    రేపు వెన్నుపోటు దినోత్సవం నిరసనలకు పిలుపు… 

    బుధవారం 'వెన్నుపోటు దినోత్సవం' పేరుతో రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని జగన్ పిలుపునిచ్చారు.

    తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన యువకుల కుటుంబాలను ఆయన పరామర్శించారు.

    గుంటూరు జిల్లా తెనాలిలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలను పరిశీలిస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ 'రెడ్ బుక్‌ రాజ్యాంగం' ద్వారా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు.

    తనకు వ్యతిరేకంగా స్వరం వినిపించిన ప్రతీ ఒక్కరిని అణచివేయడానికి కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    వివరాలు 

    తెనాలి ఘటన పోలీసు వ్యవస్థ దిగజారినదానికి ఉదాహరణ 

    ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని పోలీస్ వ్యవస్థ అమలు చేస్తోందని జగన్ ఆరోపించారు.

    దీనికి తెనాలి ఘటన ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు.

    రాష్ట్రంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

    తెనాలి ఘటనలో ఏమైంది, ఎలా జరిగింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

    వివరాలు 

    పోలీసులను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుతున్న ప్రభుత్వం 

    రెడ్‌ బుక్‌ పాలన కింద సీఐలు, డీఎస్పీలను ప్రభుత్వమే కలెక్షన్ ఏజెంట్లుగా మార్చిందని జగన్ ఆరోపించారు.

    ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పోలీసులను నియంత్రించి మామూళ్లు వసూలు చేయిస్తున్నారని చెప్పారు.

    ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని, పర్మిట్‌ రూములు, బెల్ట్‌ షాపుల ద్వారా భారీగా డబ్బులు వసూలు చేసి, ఆ మొత్తాన్ని చంద్రబాబు, లోకేష్‌లకు వాటా చెల్లిస్తున్నారని ఆరోపించారు.

    ఇసుక, క్వార్ట్జ్‌, లాటరైట్‌ వంటి ఖనిజ వనరులను బహిరంగంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

    వివరాలు 

    కుటుంబాల పరువు తీసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు 

    కేసులు ఉన్నారనే కారణంతో వ్యక్తులను ముద్దాయిలుగా ముద్రించడమేగాక వారి కుటుంబాల పరువును తీసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని జగన్ ప్రశ్నించారు.

    తెనాలి ఘటనలో బాధితుడు రాకేష్ చెల్లెలు ఇంజినీరింగ్ పూర్తిచేసిందని, వారి కుటుంబ పరువు తీశారని, మరో యువకుడు విక్టర్ తండ్రి ప్రజాశక్తి పత్రికలో విలేఖరిగా పనిచేస్తున్నారని చెప్పారు.

    తెనాలిలో నివాసం లేని రాకేష్‌ అనే యువకుడిని ఇష్టం వచ్చినట్లుగా కేసులో ఇరికించారని తీవ్ర ఆరోపణలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?  విజయవాడ సెంట్రల్
    Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి! ఎలక్ట్రిక్ స్కూటర్

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    Chandra mohan: చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం  టాలీవుడ్
    Andhra Pradesh : ఏపీలో రేపటి నుంచి కులగణన.. ఇంటింటి సర్వేకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్
    Harbour fire: 'ఫిషింగ్‌ హార్బర్‌' ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. స్పందించిన పవన్ వైజాగ్
    CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై 24న సుప్రీంకోర్టులో విచారణ సీబీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025