NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ గురించి ఎక్కువ మందికి తెలియని విషయాలు 
    తదుపరి వార్తా కథనం
    వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ గురించి ఎక్కువ మందికి తెలియని విషయాలు 

    వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ గురించి ఎక్కువ మందికి తెలియని విషయాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 26, 2023
    11:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత జాతీయ గీతం జనగణమన అయితే జాతీయ గేయం(నేషనల్ సాంగ్) వందేమాతరం. ఈ పాటను బంకించంద్ర ఛటర్జీ రచించారు.

    1882లో ఆయన ప్రచురించిన ఆనంద్ మఠ్ అనే నవల నుండి వందేమాతరం శ్లోకాన్ని తీసుకున్నారు. ఈరోజు బంకించంద్ర ఛటర్జీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని విశేషాలు తెలుసుకుందాం.

    నిజానికి బంకించంద్ర ఛటర్జీ అసలు పేరు బంకించంద్ర చటోపాధ్యాయ. కానీ బ్రిటిష్ వారు పలకలేక ఛటర్జీ అని పిలిచారు. ఆ తర్వాత అదే అలవాటుగా మారింది.

    ఛటర్జీ ఒక నవలాకారుడుగా, రచయితగా, జర్నలిస్టుగా పనిచేశారు. సాహిత్య సామ్రాట్ అనే బిరుదు గల ఛటర్జీ, 1838 జూన్ 26వ తేదీన పశ్చిమబెంగాల్ లోని నైహటి గ్రామంలో జన్మించారు.

    Details

    ఆనంద్ మఠ్ నవలలో బెంగాల్ కరువు పరిస్థితులు 

    ఆ కాలంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవి. బంకించంద్ర ఛటర్జీకి 11 ఏళ్ల వయసులో పెళ్లి జరిగింది. అయితే మొదటి భార్య ఏవో కారణాలవల్ల మరణించడంతో మరో భార్య రాజ్యలక్ష్మి దేవిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ముగ్గురు కూతుళ్లు.

    రచయితగా ఎన్నో రచనలు చేసిన బంకించంద్ర చటర్జీకి మొదటగా సాంగ్ బడ్ ప్రభాకర్ అనే వీక్లీ మ్యాగజైన్ ద్వారా గుర్తింపు వచ్చింది. అప్పటినుండి రచయితగా ఆయన కెరీర్ మలుపు తిరిగింది.

    1882లో ఆనంద్ మఠ్ ప్రచురించారని ముందే చెప్పుకున్నాం. 1770లో బెంగాల్ లో వచ్చిన కరువు పరిస్థితులను ఈ నవలలో తెలియజేశారు ఛటర్జీ.

    ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఎలాంటి శిక్షణాలేని భారత సైన్యం ఎదుర్కొన్నట్లుగా ఈ నవలలో ఛటర్జీ ఊహిస్తూ రాసుకొచ్చారు.

    Details

    ఇంగ్లీష్ లో రచనలు చేయాలనుకున్న ఛటర్జీ 

    సాహిత్యంలో రకరకాల ప్రయోగాలు చేసిన ఛటర్జీ, 1872లో బంగదర్శన్ అనే సాహిత్య మ్యాగజైన్ ను మొదలుపెట్టారు. ఈ మ్యాగజైన్లో కథలు, చారిత్రక అంశాలు, వ్యాసాలు, కార్టూన్స్ ఉండేవి.

    బెంగాల్ లో రచనలు చేసే ఛటర్జీ ఇంగ్లీషులో కూడా రచనలు చేయాలని అనుకున్నారు. కానీ ఇంగ్లీష్ మీద పట్టు లేకపోవడంతో తన మాతృభాష బెంగాల్ లోనే రచనలు చేస్తూ వచ్చారు.

    దుర్గేష్ నందిని, కపాల్ కుండల అనే రెండు నవలలు ఛటర్జీ మొదటి ప్రచురణలు. వీటిని ఇతర భాషల్లోకి కూడా అనువదించారు.

    ఛటర్జీ కెరీర్లో చెప్పుకోదగ్గ నవలలుగా పేరు తెచ్చుకున్న వాటిల్లో చంద్రశేఖర్, రజని అనే నవలలు ఉన్నాయి. ఛటర్జీ రచనల ఆధారంగా 50 సినిమాల వరకు తెరకెక్కాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుట్టినరోజు

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    పుట్టినరోజు

    శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న తెలుగు సినిమా
    ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి  తెలుగు సినిమా
    సచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్ సచిన్ టెండూల్కర్
    రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్  రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025