Loading...
Vinayaka Chavithi Festival:వీధుల్లో వినాయకుడి ఉత్సవాలకు నాంది పలికింది ఎవరు? అసలు కారణం ఇదే 
వీధుల్లో వినాయకుడి ఉత్సవాలకు నాంది పలికింది ఎవరు? అసలు కారణం ఇదే

Vinayaka Chavithi Festival:వీధుల్లో వినాయకుడి ఉత్సవాలకు నాంది పలికింది ఎవరు? అసలు కారణం ఇదే 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2024
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయకుడి విగ్రహాలను వీధుల్లో ప్రతిష్టించే సంప్రదాయం ఎలా ప్రారంభమైందో ఓసారి తెలుసుకుందాం. ఈ సంప్రదాయం అనేది భారతదేశ స్వాతంత్య్ర పోరాటంతో కూడా సంబంధం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి వినాయకుని పండుగ హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకం. వినాయకుడు వీధుల్లో ప్రజలకు చేరువగా ఉంటాడు. కానీ ఈ సంప్రదాయం వెనుక ఉన్న చరిత్ర గురించి చాలా మందికి తెలియదు.

Details

ఉత్సవాలకు పిలుపునిచ్చిన బాల గంగాధర్ తిలక్

బ్రిటీష్ వారి పాలనలో భారతదేశానికి స్వాతంత్య్ర కోసం పోరాడాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ పోరాటంలో భారతీయులందర్నీ ఏకం చేయడానికి పండుగలను వేదికగా మార్చాలనే ఆలోచన వచ్చింది.

1894లో మహారాష్ట్ర పుణే నగరంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గణేశ్ ఉత్సవాలను సామూహికంగా జరపాలని నిర్ణయించారు.

ఆ పిలుపుతోనే గణపతి ఉత్సవాలు మహారాష్ట్ర, హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.

Details

స్వాతంత్య్ర పోరాటానికి మూలస్తంభంగా వినాయక ఉత్సవాలు

హైదరాబాద్‌లో 1895లో శాలిబండ ప్రాంతంలో భారత గుణవర్థక్ సంస్థ స్థాపించింది.

ఈ సంస్థ ఆధ్వర్యంలో విగ్రహాలను ప్రతిష్టించి, 9 రోజుల పాటు పూజలు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ ఉత్సవాలు సామాజిక చైతన్యం కలిగించడమే కాకుండా, ప్రజలను ఒకతాటిపైకి తీసుకురావడంలో కూడా ప్రధాన పాత్ర పోషించాయి.

అందుకే వినాయక ఉత్సవాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా, భారత స్వాతంత్య్ర పోరాటానికి మూలస్తంభంగా నిలిచాయి.

ఇలా ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ, ప్రతి గణనాయకుడి పండుగలో ప్రజలకు సమైక్యతను చాటిస్తోంది.

ADVERTISEMENT