
Yoda Day 2025: పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసిన స్వామి వివేకానంద
ఈ వార్తాకథనం ఏంటి
యోగ పాశ్చాత్య దేశాలకు ఎలా చేరింది అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే,ముందుగా 1893లో అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన ప్రపంచ మత సదస్సు గురించి తెలుసుకోవాలి.
సెప్టెంబర్ 11న జరిగిన ఆ మత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగంతో ప్రపంచ దృష్టిని భారతదేశం వైపు తిప్పారు.
భారతీయ తత్త్వశాస్త్రం,ఆధ్యాత్మికత,యోగాలోని గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేశారు.
ఆయన ఉజ్వలమైన ఉపన్యాసం అక్కడికొచ్చిన అమెరికన్లు సహా అన్ని దేశాల ప్రతినిధులను ఆకర్షించింది.
ఇదే సంఘటన యోగాను పశ్చిమ దేశాలకు ప్రవేశపెట్టే దిశగా మార్గదర్శిగా నిలిచింది.
వివరాలు
'రాజయోగం' గ్రంథం ద్వారా శాస్త్రీయ పరిచయం
1896లో స్వామి వివేకానంద రచించిన 'రాజయోగం' పుస్తకం యోగాను పాశ్చాత్యులకూ శాస్త్రీయంగా, సుసంప్రదాయబద్ధంగా పరిచయం చేసిన తొలి ఆధునిక గ్రంథంగా నిలిచింది.
ఇందులో పతంజలి యోగసూత్రాలను ఆధారంగా తీసుకుని యోగాను నాలుగు మార్గాలుగా.. భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగాలుగా విభజించి వివరించారు.
ఈ గ్రంథం యోగాకు పాశ్చాత్య దేశాల్లో ప్రాముఖ్యతను పెంచింది.
శాస్త్రీయంగా, తాత్వికంగా, ఆచరణాత్మకంగా యోగాను వివరించడంలో ఇది ముఖ్యపాత్ర పోషించింది.
అంతేకాక, పాశ్చాత్యులకు అవగాహన కలిగించేలా స్పష్టంగా విశ్లేషించి, విపులంగా వివరించింది.
వివరాలు
వేదాంత సొసైటీలుగా మారిన యోగా కేంద్రాలు
1895లో న్యూయార్క్ నగరంలో వివేకానంద వేదాంత సొసైటీని స్థాపించారు.
ఇది ఆ కాలంలో భారతీయ తత్త్వశాస్త్రం,యోగా ప్రచారానికి ముఖ్య కేంద్రంగా నిలిచింది.
ఆయన స్వయంగా యోగా, వేదాంత అంశాలపై అనేక ఉపన్యాసాలు ఇచ్చారు.
ఆయన తర్వాత కూడా ఈ సొసైటీలు యోగా ప్రచారాన్ని కొనసాగించాయి.
ప్రస్తుతం అమెరికాలో 13కు పైగా, ప్రపంచవ్యాప్తంగా 125కు మించి వేదాంత కేంద్రాలు పనిచేస్తున్నాయి.
వివరాలు
యోగాను శాస్త్రీయ సాధనగా వివరణ
స్వామి వివేకానంద యోగాను 'సైన్స్ ఆఫ్ మైండ్' (మనస్సు శాస్త్రం)గా, ప్రపంచవ్యాప్తంగా అనుసరించదగిన సాధనగా వివరించారు. యోగా కేవలం భారతీయ సంప్రదాయం పరిమితి కాదని, అది మొత్తం మానవాళికి సంబంధించిన సాధన అని స్పష్టంగా చెప్పారు.
పాశ్చాత్యులు శాస్త్రీయత, తత్త్వశాస్త్రం పట్ల ఆసక్తి చూపే వ్యక్తులైనందున, ఆయన యోగాను శాస్త్రీయంగా, తాత్వికంగా వివరించడం వల్ల వారికి విశ్వాసం కలిగింది.
వివరాలు
యోగాలో నాలుగు మార్గాలపై స్వామీజీ దృష్టి
వివేకానంద పరంగా యోగాను నాలుగు విభాగాలుగా వివరిస్తారు:
భక్తి యోగా - భగవంతునిపై అంకితభావంతో దివ్యత్వాన్ని తెలుసుకోవడం
కర్మ యోగా - నిష్కామంగా కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందడం
జ్ఞాన యోగా - జ్ఞాన మార్గం ద్వారా నిజమైన ఆత్మతత్వాన్ని గ్రహించడం
రాజయోగం - మనస్సును నియంత్రించడం ద్వారా అంతర్గత దివ్యత్వాన్ని తెలుసుకోవడం
ఈ నాలుగు మార్గాల్నీ స్వామీజీ తన రచనలు, ఉపన్యాసాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా అమెరికాలో రాజయోగాన్ని ప్రత్యేకంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.
వివరాలు
పాశ్చాత్య దేశాల్లో స్వామీజీ ప్రభావం
స్వామి వివేకానంద ప్రసంగాలు, పుస్తకాలు, మరియు ఆయన స్థాపించిన వేదాంత సంస్థలు పాశ్చాత్య దేశాల్లో యోగాకు గట్టి పునాది వేసాయి.
ఆయన తర్వాత పరమహంస యోగానంద, మహర్షి మహేశ్ యోగి, శ్రీశ్రీ రవిశంకర్ వంటి ప్రముఖులు కూడా యోగాను ప్రపంచానికి పరిచయం చేయడంలో ముందున్నారు.
అంతేగాక రచయితలు, కవులు కూడా యోగాను ప్రముఖంగా చర్చించేలా చేశారు.
యోగాను మానవతా దృక్పథంతో పరిచయం
స్వామి వివేకానంద యోగాను కేవలం హిందూ మతానికి చెందిన పరంపరగా కాక, విశ్వమానవత్వానికి సంబంధించిన సాధనంగా వివరించారు.
"ప్రతి ఆత్మా దివ్యమే" అనే సందేశాన్ని ఆయన్ని విశ్వసించారు. యోగ సాధన ద్వారా ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చనే భావనను ప్రపంచానికి వ్యాపింపజేశారు.