Page Loader
Chandrayaan 4: చంద్రయాన్-4 మిషన్ 2027లో చేపడతాం: జితేంద్ర సింగ్
చంద్రయాన్-4 మిషన్ 2027లో చేపడతాం: జితేంద్ర సింగ్

Chandrayaan 4: చంద్రయాన్-4 మిషన్ 2027లో చేపడతాం: జితేంద్ర సింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం 2027లో చంద్రయాన్ 4 మిషన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఈ మిషన్‌లో చంద్రుని నమూనాలను భూమి పైకి తీసుకురావడం లక్ష్యం. ఎల్‌వీఎం 3 రాకెట్‌ ద్వారా వేర్వేరు ప్రయోగాల తర్వాత ఐదు వేర్వేరు భాగాలు మూసుకుని స్పేస్‌లో అనుసంధానించబడతాయని ఆయన చెప్పారు. ఈ భాగాలను భూమి కక్ష్యలో ప్రవేశపెట్టడమనే ప్రక్రియలో భాగంగా, చంద్రుడి ఉపరితల నమూనాలను సేకరించి తిరిగి భూమికి చేరుకునే లక్ష్యంతో చంద్రయాన్‌-4 మిషన్‌ నిర్వహించబడుతుంది. అదేవిధంగా, గగన్‌యాన్ మిషన్‌ను వచ్చే ఏడాది ప్రయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భారతీయ వ్యోమగాములను ప్రత్యేక వాహనంలో భూమి దిగువ కక్ష్య వరకు పంపించి, తిరిగి భూమికి సురక్షితంగా తీసుకువచ్చే ప్రణాళిక ఉంది.

వివరాలు 

2026లో సముద్రయాన్‌ ప్రయోగం

2026లో సముద్రయాన్‌ ప్రయోగం భారత్‌ 2026లో సముద్రయాన్‌ మిషన్‌ను చేపడుతుందని జితేంద్ర సింగ్‌ ప్రకటించారు. ఈ మిషన్‌లో ముగ్గురు శాస్త్రవేత్తలు జలాంతర్గామి ద్వారా ఆరువేల కిలోమీటర్ల లోతుకు వెళ్లి సముద్రగర్భంలో అన్వేషణ చేయనున్నారు. సముద్రయాన్‌ ద్వారా కీలకమైన ఖనిజాలు, అరుదైన లోహాలు, తెలియని సముద్రజీవ వైవిధ్యాలపై సమాచారాన్ని సేకరించనున్నారు. జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ గగన్‌యాన్‌ మిషన్‌తో పాటు మానవరహిత మిషన్లను కూడా అదే ఏడాది నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోబోట్‌ వ్యోమ్‌ మిత్రను కూడా పంపడం ఉంది. స్పేస్‌ సెక్టార్‌లో భారత్‌ సూపర్‌ పవర్‌గా ఇస్రో 1969లో స్థాపించబడింది,కానీ 1993 వరకు తొలి లాంచ్‌ ప్యాడ్‌ను నిర్మించేందుకు రెండు దశాబ్దాల సమయం పట్టిందని జితేంద్ర సింగ్‌ తెలిపారు.

వివరాలు 

చిన్న ఉపగ్రహాల కోసం తమిళనాడులోని టుటికోరిన్‌లో కొత్త ప్రయోగ వేదిక 

2004లో రెండో లాంచ్‌ ప్యాడ్‌ను నిర్మించగా,దానికి మరో దశాబ్దం సమయం పట్టింది. గత పదేళ్లలో భారత అంతరిక్ష రంగం మౌలిక సదుపాయాలు,పెట్టుబడులు విస్తరించాయని ఆయన వివరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 3వ లాంచ్‌ ప్యాడ్‌ను శ్రీహరికోటలో నిర్మించడంతో పాటు, చిన్న ఉపగ్రహాల కోసం తమిళనాడులోని టుటికోరిన్‌లో కొత్త ప్రయోగ వేదిక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తుందని వెల్లడించారు. దీనితో, శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌ను విస్తరించడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం భారత దేశం స్పేస్‌ ఎకానమీ 8 బిలియన్‌ డాలర్ల విలువగలదని, వచ్చే దశాబ్దంలో 44 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈ వృద్ధి భారత దేశాన్ని ప్రపంచంలో సూపర్‌ పవర్‌గా నిలిపే అవకాశం కల్పించనుంది.