NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Subhanshu Shukla: ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న శుభాంశు శుక్లాకు 'Shukx' కాల్‌సైన్‌ కేటాయింపు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Subhanshu Shukla: ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న శుభాంశు శుక్లాకు 'Shukx' కాల్‌సైన్‌ కేటాయింపు 
    ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న శుభాంశు శుక్లాకు 'Shukx' కాల్‌సైన్‌ కేటాయింపు

    Subhanshu Shukla: ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న శుభాంశు శుక్లాకు 'Shukx' కాల్‌సైన్‌ కేటాయింపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2025
    01:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి పయనం చేయబోయే తుది తేదీ ఖరారయ్యింది.

    మే 29న ఆయన యాక్సియం-4 (AX-4) మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌) వైపు ప్రయాణించనున్నారు.

    ఈ మిషన్‌లో ఆయనతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్‌, పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ, హంగరీకు చెందిన టిబర్ కపు కూడా పాల్గొంటున్నారు.

    ఈ ప్రయాణానికి సంబంధించినంతగా శుభాంశు శుక్లాకు "Shukx" అనే కాల్‌సైన్‌ను నాసా అందించింది.

    వివరాలు 

    సైనిక విమానయాన రంగంలో వాడే కోడ్‌లు 

    కాల్‌సైన్‌ అనేది వ్యోమగాములకు కేటాయించే ప్రత్యేక గుర్తింపు పేరు లేదా కోడ్‌. అంతరిక్ష ప్రయాణాల సమయంలో వ్యోమగాములు పరస్పరం సంభాషించేటప్పుడు వీటినే ఉపయోగిస్తారు.

    ఈ తరహా కోడ్‌లు ముఖ్యంగా సైనిక విమానయాన రంగంలో ఎక్కువగా వాడబడతాయి,తద్వారా పైలట్ల అసలు వివరాలు లేదా వారు ఎవరిద్వారా మాట్లాడుతున్నారు అన్న విషయం శత్రు దేశాలకు తెలియకుండా ఉండేలా చేయడం వీటి ప్రధాన ఉద్దేశం.

    భారత కాలమానం ప్రకారం మే 29న రాత్రి 10:30 గంటలకు, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా ఈ నలుగురు వ్యోమగాములు నింగిలోకి పయనించనున్నారు.

    వివరాలు 

    శుభాంశు శుక్లా కనీసం ఏడుకు పైగా ప్రయోగాలు 

    వారంతా రెండు వారాలపాటు ఐఎస్‌ఎస్‌లో ఉండనున్నారు. ఈ మిషన్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా,భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కలిసి నిర్వహిస్తున్నాయి.

    ఈ మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా కనీసం ఏడుకు పైగా ప్రయోగాలలో పాల్గొనబోతున్నట్టు సమాచారం.

    అందులో భాగంగా అంతరిక్షంలో పంటల పెంపకం, వాటర్ బేర్‌ (నీటి ఎలుగుబంటి అనే సూక్ష్మ జీవి)లపై అధ్యయనం చేయనున్నారు.

    ముఖ్యంగా భారతీయ ఆహార సంస్కృతికి సంబంధించిన పంటలపై ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.

    ఇందులో మెంతి, పెసలు వంటి మొలకల పెంపకం, వాటి వృద్ధిపై పరిశీలన జరగనుంది.

    ఈ మొలకలను అనంతరం భూమికి తీసుకొచ్చి, నేలలో అవి ఎలా పెరుగుతున్నాయనే అంశాన్ని గమనించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

    ISS astronauts: అంతరిక్షంలో పేలిన రష్యా ఉపగ్రహం.. ఆశ్రయం పొందిన ISS వ్యోమగాములు  టెక్నాలజీ
    Starliner: ఆగష్టు నాటికి భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్ .. అంతరిక్ష నౌకకు మరమ్మతులు చేస్తున్న నాసా  టెక్నాలజీ
    ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామి ఎవరు? టెక్నాలజీ
    NASA: ఐఎస్ఎస్‌లో నిలిచిపోయిన NASA-SpaceX Crew-8 మిషన్‌.. కారణమిదే!  నాసా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025