
Sachin Tendulkar: ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. సంతాపం వ్యక్తం చేసిన సచిన్
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులో బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సందర్బంగా నిర్వహించిన ఉత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందగా, కనీసం 47 మంది తీవ్రంగా గాయపడిన ఘటన తెలిసిందే.
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి టైటిల్ను సొంతం చేసుకున్న ఆర్సీబీ ఈ విజయాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఎం. చిన్నస్వామి స్టేడియం సమీపంలో భారీ స్థాయిలో వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది.
దీంతో వేలాదిగా అభిమానులు అక్కడికి తరలివచ్చారు.
ఈ నేపథ్యంలోనే విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు.
బాధితుల కుటుంబాల పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఒక సందేశాన్ని ఆయన షేర్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సచిన్ చేసిన ట్వీట్
What happened at Chinnaswamy Stadium, Bengaluru, is beyond tragic. My heart goes out to every affected family. Wishing peace and strength to all. 🙏
— Sachin Tendulkar (@sachin_rt) June 4, 2025
వివరాలు
తొక్కిసలాటలో చిన్నారి
"బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగినది విషాదానికి అతీతమైనది. ప్రతి బాధిత కుటుంబానికి నా సానుభూతి. వారందరికీ శాంతి, బలాన్ని చేకూర్చాలని దేవుడిని కోరుకుంటున్నాను" అని సచిన్ తన 'ఎక్స్' పోస్ట్లో పేర్కొన్నారు.
అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ ఓపెన్ బస్ పరేడ్ ద్వారా ర్యాలీ నిర్వహించాలనే ఉద్దేశంతో ముందుగా ఏర్పాట్లు చేపట్టారు.
దీన్ని చూసేందుకు సుమారు రెండు లక్షల మంది అభిమానులు స్టేడియం పరిసరాల్లో గుమిగూడారు.
కాని, అక్కడ ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోయారు.
ఫలితంగా అక్కడ గందరగోళం ఏర్పడి, చివరికి తొక్కిసలాటకు దారితీసింది.
దురదృష్టకరంగా మృతుల్లో ఒక చిన్నారికూడా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారు ప్రస్తుతానికి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వివరాలు
ఆర్సీబీ ఫ్రాంచైజీ విచారం
మంగళవారం అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ విజయంలో కీలకంగా నిలిచిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఘటనపై స్పందించారు.
బుధవారం రాత్రి సుమారు 10:45కి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆర్సీబీ అధికారిక ప్రకటనను షేర్ చేస్తూ, "ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. హృదయం పూర్తిగా క్షోభతో నిండిపోయింది," అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజీ కూడా విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది.
వివరాలు
ప్రతి ఒక్కరి భద్రతా క్షేమమే మా ప్రాధాన్యత
"ఈ మధ్యాహ్నం జట్టు రాక సందర్భంగా నగరమంతటా జరిగిన బహిరంగ వేడుకల నేపథ్యంలో జరిగిన విషాదకర సంఘటనల గురించి మేము మీడియా ద్వారా తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరి భద్రతా క్షేమమే మా ప్రాధాన్యత. ఈ ఘోర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి మేము సంతాపాన్ని తెలుపుతున్నాము. బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము," అని ఫ్రాంచైజీ స్పష్టంచేసింది.
దీంతో ఐపీఎల్ టైటిల్ను సాధించిన ఉత్సాహ సమయంలో జరగాల్సిన సంబరాలు విషాదంలోకి మారిపోయాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ ఖాతా తెరిచిన సందర్భం ఆనందంలో ఉండాల్సిన వేళ, జరిగిన విషాదకర ఘటన ఫ్రాంచైజీతో పాటు లక్షలాది అభిమానుల హృదయాలను కలిచివేసింది.