NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై వీడిన అనిశ్చితి.. దుబాయ్‌లో భారత్‌ మ్యాచ్‌లు
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై వీడిన అనిశ్చితి.. దుబాయ్‌లో భారత్‌ మ్యాచ్‌లు
    దుబాయ్‌లో భారత్‌ మ్యాచ్‌లు

    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై వీడిన అనిశ్చితి.. దుబాయ్‌లో భారత్‌ మ్యాచ్‌లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 23, 2024
    08:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై అనిశ్చితి తొలగిపోయిన విషయం తెలిసిందే.

    బీసీసీఐ సూచన మేరకు టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు పీసీబీ సుముఖత వ్యక్తం చేసింది.

    అయితే, పీసీబీ కోరినట్లుగా , 2024-27 మధ్య ఐసీసీ ఈవెంట్లలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లు భారత్ లేదా పాకిస్థాన్‌లో కాకుండా తటస్థ వేదికల్లో నిర్వహించనున్నారు.

    భద్రతా కారణాలను ఉటంకిస్తూ, పాక్‌లో టీమిండియా పర్యటించలేదని బీసీసీఐ స్పష్టమైన వైఖరి తెలియజేయడంతో పీసీబీ ఈ ఆమోదానికి వచ్చిందని తెలుస్తోంది.

    వివరాలు 

    దుబాయ్‌లో భారత్‌ మ్యాచ్‌లు 

    టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే మ్యాచ్‌లకు దుబాయ్‌ను తటస్థ వేదికగా నిర్ణయించారు.

    సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. అయితే, భారత జట్టు ఫైనల్‌కు చేరుకోకపోతే, ఆ తుది పోరు లాహోర్‌లో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

    భారత్, పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుందని, ఛాంపియన్స్‌ ట్రోఫీ తుది షెడ్యూల్‌ను ఐసీసీ త్వరలో ప్రకటించనున్నట్లు పీసీబీ ప్రతినిధి అమిర్ మీర్ వెల్లడించారు.

    రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్, పాకిస్థాన్ జట్లు ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడడం లేదు.

    ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఈ రెండు జట్లు పరస్పరం తలపడుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఐసీసీ

    'హాల్ ఆఫ్ ఫేమ్'లో డయానా ఎడుల్జీ.. మహిళా క్రికెట్ స్థాయిని పెంచిందన్న ఝలన్ గోస్వామి క్రికెట్
    ODI World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచుకు అంపైర్లు ప్రకటన వన్డే వరల్డ్ కప్ 2023
    World Cup final: నేడే టీమిండియా vs ఆస్ట్రేలియా ఫైనల్.. పిచ్ ఎవరికి అనుకూలం?  ప్రపంచ కప్
    ICC కీలక ప్రకటన.. అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు నిషేధం క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025