Page Loader
ENG vs IND : రెండో టెస్టు ముందు రిషభ్ పంత్‌ను ఊరిస్తున్న రికార్డ్స్ ఇవే.. కోహ్లీని దాటేస్తాడా..?
రెండో టెస్టు ముందు రిషభ్ పంత్‌ను ఊరిస్తున్న రికార్డ్స్ ఇవే.. కోహ్లీని దాటేస్తాడా..?

ENG vs IND : రెండో టెస్టు ముందు రిషభ్ పంత్‌ను ఊరిస్తున్న రికార్డ్స్ ఇవే.. కోహ్లీని దాటేస్తాడా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2025
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జూలై 2 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌ను ఒక ప్రత్యేకమైన రికార్డు ఊరిస్తోంది. ఈ టెస్టులో పంత్ సెంచరీ సాధిస్తే, ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు. ఆ స్థానం ఇప్పటివరకు మోహమ్మద్ అజారుద్దీన్‌దే. అదే స‌మ‌యంలో కోహ్లీని అధిగ‌మిస్తాడు. ప్రస్తుతం పంత్,కోహ్లీ ఇద్దరూ ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో చెరో ఐదు సెంచరీలు సాధించారు.

వివరాలు 

ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు: 

ఇక అజారుద్దీన్ ఖాతాలో ఆరు శతకాలు ఉన్నాయి. ఈ జాబితాలో అగ్రస్థానాల్లో భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. వీరిద్దరూ ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో చెరో ఏడు సెంచరీలు బాదారు. సచిన్ టెండూల్కర్ - 7శతకాలు రాహుల్ ద్రవిడ్ - 7శతకాలు మోహమ్మద్ అజారుద్దీన్ - 6శతకాలు విరాట్ కోహ్లీ - 5శతకాలు రిషభ్ పంత్ - 5శతకాలు ఇక ప్రస్తుతానికి పంత్ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు.హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆయన శతకాలు సాధించాడు. అతడు గొప్పగా ఆడినప్పటికీ,ఆ మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. ఈనేపథ్యంలో రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే ఉద్దేశంతో టీమ్ ఇండియా బరిలోకి దిగనుంది.