LOADING...
Team India: ఇంగ్లాండ్‌తో సిరీస్ డ్రా.. మరి ఇప్పుడు టీమిండియా WTC ఫైనల్‌కి ఎలా అర్హత సాధించగలదు?
ఇంగ్లాండ్‌తో సిరీస్ డ్రా.. మరి ఇప్పుడు టీమిండియా WTC ఫైనల్‌కి ఎలా అర్హత సాధించగలదు?

Team India: ఇంగ్లాండ్‌తో సిరీస్ డ్రా.. మరి ఇప్పుడు టీమిండియా WTC ఫైనల్‌కి ఎలా అర్హత సాధించగలదు?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓవల్‌ మైదానంలో జరిగిన ఐదవ టెస్టులో టీమిండియా విజయం సాధించింది. మొత్తం 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను 367 పరుగులకే కట్టడి చేసి, భారత జట్టు 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. భారత బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీయగా, ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీసి మెరిశాడు.

వివరాలు 

WTC 2027 ఫైనల్‌కు అర్హత ఎలా సాధించొచ్చు? 

గత ఏడాది న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో పరాజయాలను చవిచూసిన భారత్ ఫైనల్‌కు చేరలేదు. అయితే తాజా విజయంతో 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌ను భారత జట్టు విజయవంతంగా ప్రారంభించింది. ఈ విజయం వల్ల టీమిండియా పాయింట్ల శాతం (పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్స్ - PCT) 46.67కు పెరిగింది. అదే సమయంలో ఇంగ్లాండ్ PCT 43.33కి తగ్గింది. ఈ గెలుపు భారత జట్టుకు ఫైనల్‌కు చేరే ఆశలను పెంచినప్పటికీ, ఇది కేవలం ఆరంభం మాత్రమే. షెడ్యూల్ ప్రకారం, టీమిండియా ముందుగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లు ఆడనుంది. వీటిలో మ్యాచులన్నీ దేశవాళీ మైదానాల్లోనే జరగనున్నందున, విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.

వివరాలు 

WTC 2027 ఫైనల్‌కు అర్హత ఎలా సాధించొచ్చు? 

అంతేకాక, శ్రీలంకలో రెండు టెస్టులు, న్యూజిలాండ్‌లో మరో రెండు టెస్టులు జరగనున్నాయి. శ్రీలంక సిరీస్‌లో విజయం సాధించే అవకాశాలు ఉన్నా, న్యూజిలాండ్‌లో మాత్రం భారత్‌కు కాస్త గట్టి సవాలే ఎదురవుతుంది. ఆ తరువాత చివరి భాగంలో భారత్, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల ఇంటి సిరీస్‌ను ఆడనుంది. ఈ సైకిల్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే విదేశాల్లో ఉండటంతో, దేశంలో జరిగే సిరీస్‌లను పూర్తిగా గెలిచినట్లయితే టీమిండియాకు ఫైనల్‌ టికెట్ దక్కే అవకాశాలు మిన్నగానే ఉంటాయి. అయితే, ఇదే సమయంలో ఇతర కీలక జట్లు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక వంటి వాటి ప్రదర్శన కూడా భారత అర్హతపై ప్రభావం చూపనుంది.

వివరాలు 

ఫైనల్‌కి అర్హత సాధించాలంటే? 

విదేశీ పర్యటనల్లో ముఖ్యంగా న్యూజిలాండ్‌లో భారత్ ఓటములను తగ్గించాల్సిన అవసరం ఉంది. భారత్‌కు దేశవాళీ మైదానాల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఉండటంతో, విజయవంతమైన ప్రదర్శన చేస్తే ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా ఇతర ప్రధాన జట్లు ఎలా ఆడతాయన్నదే తుది ఫలితాన్ని నిర్ణయించబోతోంది.