NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / champions trophy 2025: నేటి నుంచే ఛాంపియన్స్‌ ట్రోఫీ.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ × కివీస్‌
    తదుపరి వార్తా కథనం
    champions trophy 2025: నేటి నుంచే ఛాంపియన్స్‌ ట్రోఫీ.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ × కివీస్‌
    నేటి నుంచే ఛాంపియన్స్‌ ట్రోఫీ.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ × కివీస్‌

    champions trophy 2025: నేటి నుంచే ఛాంపియన్స్‌ ట్రోఫీ.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ × కివీస్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 19, 2025
    08:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డేల్లోప్రపంచకప్ తర్వాత అత్యంత ఉత్కంఠభరితంగా మారనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది..

    2017 తర్వాత రద్దయిన ఈ టోర్నమెంట్ ఇప్పుడు మళ్లీ పునరుజ్జీవనం పొందుతోంది.

    దీనికి పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నారు.

    పాకిస్థాన్ అధికారికంగా ఆతిథ్య దేశమైనప్పటికీ, భారత్ ఆ దేశంలో ఆడేందుకు అంగీకరించకపోవడంతో రోహిత్ సేన మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించనున్నారు.

    అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న టీమిండియా ఈ సారి టైటిల్ ఫేవరెట్‌లలో ఒకటిగా ఉంది.

    గురువారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో భారత్ తన పోరాటాన్ని ఆరంభించనుంది, అయితే బుధవారం పాకిస్థాన్-న్యూజిలాండ్ తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది.

    ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ కూడా టోర్నీలో పోటీ పడనున్నాయి. అయితే, వెస్టిండీస్, శ్రీలంక అర్హత సాధించలేకపోయాయి.

    వివరాలు 

    ఓపెనింగ్ మ్యాచ్ - పాకిస్థాన్ తన ప్రతిష్ట నిలబెట్టుకోగలదా? 

    1996లో చివరిసారిగా భారత్, శ్రీలంకలతో కలిసి వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్, దాని తర్వాత ఏ ఐసీసీ టోర్నీ నిర్వహించలేదు.

    ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్, ప్రదర్శన పరంగా కూడా తన ప్రత్యేకతను చాటాలనుకుంటోంది.

    తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొననున్న పాక్, సొంతగడ్డపై విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.

    కానీ, న్యూజిలాండ్ ముక్కోణపు సిరీస్‌లో లీగ్ దశతో పాటు ఫైనల్‌లోనూ పాక్‌ను ఓడించింది.

    కివీస్ బ్యాటింగ్ విభాగంలో విలియమ్సన్, కాన్వే, మిచెల్, లాథమ్, ఫిలిప్స్ ఉన్నారు.

    బౌలింగ్‌లో హెన్రీ, డఫీ, శాంట్నర్, ఒరూర్క్, బ్రాస్‌వెల్ కీలక ఆటగాళ్లు. ఫిలిప్స్ బంతితో, బ్రాస్‌వెల్, శాంట్నర్ బ్యాటుతో ప్రభావం చూపగలరు.

    వివరాలు 

    బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్

    అదే విధంగా, పాకిస్థాన్ కూడా మంచి ఫామ్‌లో ఉంది. బాబర్ అజామ్,ఫఖర్ జమాన్, రిజ్వాన్, సల్మాన్ అఘా బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చూపుతుండగా,షాహీన్ అఫ్రిది,హారిస్ రవూఫ్, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ బౌలింగ్ విభాగాన్ని సమర్థంగా నడుపుతున్నారు.

    కరాచీలో జరగనున్న ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ ఉంటుంది.స్పిన్నర్లు కీలక భూమిక పోషించే అవకాశం ఉంది.టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపనుంది.

    పాకిస్థాన్‌పై ఒత్తిడి - టోర్నీ నిర్వహణ సవాళ్లు

    ఐసీసీ టోర్నీని పాకిస్థాన్ హోస్టింగ్ చేయడం ఓ గొప్ప ముందడుగు.2008 శ్రీలంక జట్టుపై జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయింది.

    కొన్ని సంవత్సరాలుగా ద్వైపాక్షిక సిరీస్‌లను విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఐసీసీ ఈ టోర్నీకి పచ్చజెండా ఊపింది.

    వివరాలు 

    టోర్నీ నిర్వహణ పట్ల పీసీబీపై విమర్శలు

    అయితే, భారత్ మాత్రం పాకిస్థాన్‌లో ఆడేందుకు అంగీకరించలేదు కాబట్టి తన మ్యాచ్‌లను యూఏఈలో ఆడనుంది.

    టోర్నీ నిర్వహణ పట్ల పీసీబీపై విమర్శలు ముంచెత్తుతున్నాయి. కరాచీ, లాహోర్ స్టేడియాల్లో నూతనీకరణ పనులు ఆలస్యం కావడం, నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు రావడం ప్రధాన సమస్యలు.

    ఇటీవల ముక్కోణపు సిరీస్‌లో కరాచీ స్టేడియంలో వెలుతురు సరిగా లేక న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర గాయపడడం వివాదంగా మారింది.

    ఆ వ్యవహారం పెద్ద వివాదంగా మారకుండా ఐసీసీ, పీసీబీ చూసుకున్న, టోర్నీ నిర్వహణ సజావుగా సాగితే భవిష్యత్తులో పాక్‌లో మరిన్ని టోర్నీలు జరిగే అవకాశం ఉంటుంది.

    వివరాలు 

    భారత్ సెమీస్‌లోకి వస్తే… 

    భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే, తొలి సెమీస్ దుబాయ్‌లో జరుగుతుంది.

    రెండో సెమీస్ పాకిస్థాన్‌లో ఉంటుంది. ఫైనల్‌లో భారత్ చేరితే దుబాయ్‌లోనే తుది పోరు జరుగుతుంది. అయితే, భారత్ ఫైనల్ చేరకపోతే పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది.

    చాంపియన్స్ ట్రోఫీ - విజేతల చరిత్ర

    1998లో తొలిసారిగా బంగ్లాదేశ్‌వేదికగా టోర్నీని నిర్వహించారు.

    భారత్ - 2002 (శ్రీలంకతో ఉమ్మడి విజేత), 2013 (ఇంగ్లాండ్‌పై గెలుపు) ఆస్ట్రేలియా - 2006, 2009 దక్షిణాఫ్రికా - 1998 న్యూజిలాండ్ - 2000 వెస్టిండీస్ - 2004 పాకిస్థాన్ - 2017

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛాంపియన్స్ ట్రోఫీ

    తాజా

    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు

    ఛాంపియన్స్ ట్రోఫీ

    Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్ అజిత్ అగార్కర్
    Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం క్రీడలు
    Rohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ  రోహిత్ శర్మ
    Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..! క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025