NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Ravichandran Ashwin: ఫైనల్‌కు ముంబయి వస్తే, ఆర్సీబీకి కష్టమే : రవిచంద్రన్ అశ్విన్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ravichandran Ashwin: ఫైనల్‌కు ముంబయి వస్తే, ఆర్సీబీకి కష్టమే : రవిచంద్రన్ అశ్విన్
    ఫైనల్‌కు ముంబయి వస్తే, ఆర్సీబీకి కష్టమే : రవిచంద్రన్ అశ్విన్

    Ravichandran Ashwin: ఫైనల్‌కు ముంబయి వస్తే, ఆర్సీబీకి కష్టమే : రవిచంద్రన్ అశ్విన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 30, 2025
    06:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్‌ 2025 సీజన్‌ చివరి దశకు చేరుకుంది. గురువారం జరిగిన క్వాలిఫయర్‌ 1లో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది.

    ఇక పంజా,బ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌, ముంబయి ఇండియన్స్‌ తుది స్థానానికి పోటీ పడుతున్నాయి.

    అదే సమయంలో, గుజరాత్ టైటాన్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ మరికొన్ని గంటల్లో జరగనుంది.

    ఇందులో ఓడిపోయిన జట్టు టోర్నీకి గుడ్‌బై చెప్పాల్సి వస్తుంది. గెలిచిన జట్టు, జూన్‌ 1న క్వాలిఫయర్‌-2లో ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.

    ఇక ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే జూన్‌ 3న ఫైనల్లో బెంగళూరుతో తలపడుతుంది.

    Details

    ముంబయిని ఫైనల్లోకి రానివ్వకూడదు

    ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ ఆఫ్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    "రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తమ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను సాధించాలంటే, ముంబయి ఇండియన్స్‌ను ఫైనల్లోకి రానివ్వకపోతే మంచిదని తన యూట్యూబ్‌ ఛానల్‌లో అభిప్రాయపడ్డాడు.

    "ఒకవేళ ముంబయి ఫైనల్‌కు చేరితే, ఆర్సీబీ ఆశలు చెల్లాచెదురైపోతాయి. ముంబయి గెలిస్తే అది ఆరవ టైటిల్ అవుతుంది. బెంగళూరు టైటిల్‌ గెలవాలంటే గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొంటే బాగుంటుంది.

    Details

    విరాట్ కోహ్లీపై అశ్విన్ ప్రశంసలు

    క్రికెట్‌లో ఏదైనా జరిగే అవకాశం ఉంది. అయినా బెంగళూరు ఇప్పుడు బలంగా కనిపిస్తోందని అన్నాడు. అశ్విన్‌ మాట్లాడుతూ విరాట్‌ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.

    "ఇది ఆర్సీబీ సంవత్సరం కావచ్చు. విరాట్‌ కోహ్లీ తన ఆటతీరుతో బెంగళూరు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

    ఇండియన్‌ టెస్టు క్రికెట్‌లో గొప్ప కెప్టెన్లలో ఒకరిగా పేరున్న కోహ్లీకి, కీలక మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌ పట్ల గొప్ప అవగాహన ఉంది.

    ఫైనల్‌లో ఛేజింగ్‌ చేయాల్సిన అవసరం వస్తే, అతడి నాయకత్వంలో ఆర్సీబీ ముందంజ వేసే అవకాశాలున్నాయని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తాజా

    Ravichandran Ashwin: ఫైనల్‌కు ముంబయి వస్తే, ఆర్సీబీకి కష్టమే : రవిచంద్రన్ అశ్విన్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    'Akhanda 2': జార్జియాలో 'అఖండ 2' షెడ్యూల్.. షూటింగ్ సీన్ లీక్! బాలకృష్ణ
    Insurance: వర్షాకాలం వచ్చేసింది.. మీ కారుకు సరైన ఇన్సూరెన్స్ కవరేజీ ఉందా? వర్షాకాలం
    West Bengal: బెంగాల్‌లో తల్లిదండ్రులను చంపి.. శవాలను వీధిలోకి ఈడ్చుకుంటూ వెళ్ళిన 'రాడికలైజ్డ్' ఇంజనీర్  పశ్చిమ బెంగాల్

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    'కోహ్లీ రివ్యూ సిస్టమ్' సూపర్.. మైదానంలో పక్కా వ్యూహాలు విరాట్ కోహ్లీ
    IPL 2023: విజృంభించిన మాక్సెవెల్, డుప్లెసిస్, ఆర్సీబీ భారీ స్కోరు రాజస్థాన్ రాయల్స్
    IPL 2023: ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే గెలుపు రాజస్థాన్ రాయల్స్
    KKR vs RCB: కేకేఆర్ బ్యాటర్లు ధనాధన్; ఆర్సీబీ లక్ష్యం 201 పరుగులు కోల్‌కతా నైట్ రైడర్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025