NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. జస్‌ప్రీత్ బుమ్రా ఔట్.. కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం  
    తదుపరి వార్తా కథనం
    IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. జస్‌ప్రీత్ బుమ్రా ఔట్.. కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం  

    IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. జస్‌ప్రీత్ బుమ్రా ఔట్.. కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 26, 2024
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత జట్టు చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది.బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో ఓడించింది.

    ఇప్పుడు టీమిండియా రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని, అలాగే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని, ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత స్థిరపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుండటంతో, భారత జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

    వివరాలు 

    అక్షర్ పటేల్‌ను తీసుకుంటారా?

    కాన్పూర్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, భారత్ అదనపు స్పిన్నర్‌ను జట్టులో చేర్చే అవకాశముంది.

    ప్రత్యేక స్పిన్నర్లుగా అశ్విన్, రవీంద్ర జడేజా ఆడటం ఖాయమే. అయితే, మూడో స్పిన్నర్‌గా ఎవరిని ఎంచుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.

    మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేస్తారా? లేక బ్యాటింగ్ బలోపేతం కోసం అక్షర్ పటేల్‌ను తీసుకుంటారా? అన్నది చూడాలి. కుల్దీప్ జట్టులో చేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

    అదనపు స్పిన్నర్ జట్టులో చేరడం వల్ల ఒక పేసర్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.

    వివరాలు 

    బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు లేవు 

    న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ దృష్ట్యా, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉందని సమాచారం.

    దాంతో, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ తుది జట్టులో కొనసాగే అవకాశముంది.

    బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు.

    గిల్, కోహ్లీ, పంత్, రాహుల్‌లు వరుసగా బ్యాటింగ్ చేయనున్నారు. గిల్, పంత్, అశ్విన్ మొదటి టెస్టులో సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.

    భారత్ తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా

    తాజా

    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్

    టీమిండియా

    IND vs SL : మొదటి టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ శ్రీలంక
    IND vs SL : నేడు రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా శ్రీలంక
    IND vs SL : టీమిండియా గెలుపు.. సిరీస్ కైవసం శ్రీలంక
    IND vs SL : క్లీన్ స్వీపే లక్ష్యంగా బరిలోకి భారత్ శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025