NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs ENG: రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌.. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IND vs ENG: రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌.. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో!
    రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌.. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో!

    IND vs ENG: రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌.. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 21, 2025
    10:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ జరగనుంది.

    ఆతిథ్య భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వం వహిస్తుండగా, ఇంగ్లాండ్‌ జట్టుకు జోస్‌ బట్లర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

    ఇరు జట్లు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకుని శనివారం నుంచి ప్రాక్టీస్‌ చేస్తున్నాయి.

    మూడు సంవత్సరాల తర్వాత ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20 మ్యాచ్‌ జరగబోవడంతో ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భారత్‌ ఇంగ్లాండ్‌పై టీ20ల్లో అద్భుత రికార్డు కలిగి ఉంది.

    Details

    యువ క్రికెటర్లతో భారత జట్టు

    ఇప్పటివరకు జరిగిన 24 మ్యాచ్‌లలో భారత్‌ 13 గెలవగా, ఇంగ్లాండ్‌ 11 విజయాలు సాధించింది. ఈ రికార్డు భారత జట్టు నమ్మకాన్ని మరింత పెంచుతోంది.

    ప్రస్తుత భారత జట్టు యువ క్రికెటర్లతో నిండివుంది. ప్రపంచ కప్‌ తర్వాత భారత్‌ తమ ఫామ్‌ను కొనసాగిస్తోంది.

    సంజూ శాంసన్, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, అభిషేక్‌ శర్మ, రింకు సింగ్‌, నితీష్‌ రాణా వంటి హార్డ్‌ హిట్టర్లు బౌండరీల వర్షం కురిపిస్తున్నారు.

    ఇంగ్లాండ్‌ జట్టు కూడా తక్కువేం కాదు. టెస్టు క్రికెట్లో దూకుడు ఆటను నేర్పించిన మెక్‌కలమ్‌ ఇప్పుడు టీ20 కోచ్‌గా తమ ఆటను మరింత మెరుగుపరుస్తున్నారు.

    Details

    అభిమానుల్లో భారీ అంచనాలు

    జోస్‌ బట్లర్‌, ఫిల్‌ సాల్ట్‌, లివింగ్‌స్టోన్‌, జాకబ్‌ బెటెల్‌, హ్యారీ బ్రూక్‌ లాంటి ఆందోళనకర ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

    ఇంగ్లాండ్‌ టీమిండియాపై ఒత్తిడి సృష్టించేందుకు సిద్ధమవుతుండగా, భారత యువ ఆటగాళ్లు తాము ఏమిటో చాటిచెప్పేందుకు రంగంలోకి దిగుతున్నారు.

    స్టేడియంలో రికార్డుల వర్షం కురిసే అవకాశం ఉన్న ఈ మ్యాచ్‌ అభిమానులలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత జట్టు
    టీమిండియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    భారత జట్టు

    రాహుల్ ఐదో స్థానానికి ఫర్‌ఫెక్ట్..! క్రికెట్
    మూడో వన్డేలో భారత్‌కు రికార్డ్ విక్టరీ క్రికెట్
    శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన మహ్మద్ సిరాజ్ క్రికెట్
    న్యూజిలాండ్ సిరీస్ పై భారత్ గురి..! క్రికెట్

    టీమిండియా

    Vinod Kambli: క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స..  క్రీడలు
    Tanush Kotian: టీమిండియాకి రిక్రూట్ అయిన తనుష్ కోటియన్ ఎవరు? క్రీడలు
    AUS vs IND: బాక్సింగ్‌ డే టెస్టుకు ఆసీస్‌ తుది జట్టు ప్రకటన.. సామ్ కాన్ట్సాస్ అరంగేట్రం ఆస్ట్రేలియా
    Axar Patel: తండ్రైన అక్షర్ పటేల్.. ముందే చెప్పిన రోహిత్ శర్మ! అక్షర్ పటేల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025