NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Virat Kohli: రంజీ ట్రోఫీ చివరి రౌండ్‌ నేటి నుంచే.. అందరి దృష్టి కోహ్లీపైనే
    తదుపరి వార్తా కథనం
    Virat Kohli: రంజీ ట్రోఫీ చివరి రౌండ్‌ నేటి నుంచే.. అందరి దృష్టి కోహ్లీపైనే

    Virat Kohli: రంజీ ట్రోఫీ చివరి రౌండ్‌ నేటి నుంచే.. అందరి దృష్టి కోహ్లీపైనే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 30, 2025
    08:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ ఆదేశించడంతో, టీమ్‌ ఇండియాలోని ప్రముఖ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బాట పట్టారు.

    గత వారం టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్, శుభ్‌మన్‌ గిల్‌ రంజీలో బరిలోకి దిగగా, ఇప్పుడు స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్, మహ్మద్‌ సిరాజ్‌ సిద్ధమయ్యారు.

    గురువారం ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూప్-డి చివరి రౌండ్‌లో, దిల్లీ రైల్వేస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

    12 సంవత్సరాల తర్వాత దేశవాళీ క్రికెట్లో దిల్లీ తరఫున కోహ్లి ఆడనుండటంతో, ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

    దాదాపు 10,000 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశమున్న ఈ పోరులో, కోహ్లి ప్రదర్శనపై క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

    వివరాలు 

     కేఎల్‌ రాహుల్‌ కర్ణాటక తరఫున బరిలోకి కేఎల్‌ రాహుల్‌

    ప్రస్తుతం 17 పాయింట్లతో గ్రూప్-డి పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న రైల్వేస్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే, నాకౌట్‌ దశకు చేరే అవకాశముంది.

    ఇక 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న దిల్లీకి అనుకూల ఫలితం వచ్చినా, నాకౌట్‌ చేరుకోవడం చాలా కష్టమే.

    ప్రస్తుతం తమిళనాడు (25), చండీగఢ్‌ (19), సౌరాష్ట్ర (18) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

    ఇక గ్రూప్-సి చివరి రౌండ్‌లో, హరియాణాతో పోటీకి కర్ణాటక సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ కర్ణాటక తరఫున బరిలోకి దిగనున్నాడు.

    నాకౌట్‌ రేసులో నిలవాలంటే, కర్ణాటక తప్పక గెలవాల్సిందే. మరోవైపు, మహ్మద్‌ సిరాజ్‌ నాగ్‌పుర్‌లో జరిగే విదర్భతో మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    రంజీ ట్రోఫీ

    తాజా

    Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ  గుజరాత్ టైటాన్స్
    Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం కల్వకుంట్ల కవిత
    PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ నరేంద్ర మోదీ

    విరాట్ కోహ్లీ

    Virat Kohli: స‌చిన్ రికార్డు పై క‌న్ను.. మ‌రో మైలురాయికి చేరువ‌లో కోహ్లీ  క్రీడలు
    Virat Kohli: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌.. లండన్‌ నుంచి నేరుగా చెన్నై చేరుకున్న కోహ్లీ   క్రీడలు
    Virat Kohli: కివీస్‌ సిరీస్‌లో భారీ మైలురాయికి చేరువలో విరాట్‌ కోహ్లీ టీమిండియా
    AUS vs IND: విరాట్‌ కోహ్లీని ఫోకస్‌ చేస్తూ పోస్టర్‌. ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ అభిమానులు  రోహిత్ శర్మ

    రంజీ ట్రోఫీ

    అవేష్‌ఖాన్ బౌలింగ్‌లో గాయపడ్డ హనుమ విహారి క్రికెట్
    ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రికార్డు క్రియేట్ చేసిన మయాంక్ అగర్వాల్ క్రికెట్
    కర్ణాటక తరఫున సూపర్ సెంచరీతో మెరిసిన శ్రేయాస్ గోపాల్ క్రికెట్
    ఉత్తరాఖండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు చేరిన కర్ణాటక క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025