NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ICC: భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    ICC: భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు!
    భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు!

    ICC: భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 22, 2025
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఓ వివాదం చెలరేగింది.

    ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అధికారిక లోగోలో పాకిస్తాన్ పేరు లేకపోవడంపై పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

    లోగో వివాదం - పీసీబీ ఫిర్యాదు

    ఫిబ్రవరి 20న జరిగిన భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ప్రత్యక్ష ప్రసారంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అధికారిక లోగోను ప్రదర్శించారు.

    అయితే ఆతిథ్య దేశమైన పాకిస్థాన్ పేరు లేకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఐసీసీకి లేఖ రాసింది.

    Details

    ఐసీసీకి పీసీబీ లేఖ

    ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రసారం సమయంలో లోగోలో పాకిస్థాన్ పేరు లేకపోవడం ఆమోదయోగ్యం కాదని, దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లతో సహా అన్ని ప్రసారాల్లో ఈవెంట్ పేరు, ఆతిథ్య దేశం వివరాలు సరైన విధంగా ఉండాలని పేర్కొంది.

    ఐసీసీ వివరణ

    ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పందించింది. ప్రసారంలో పాక్ పేరును చూపించకపోవడం సాంకేతిక లోపం కారణంగా జరిగిందని స్పష్టం చేసింది.

    ఐసీసీ ప్రతినిధి ప్రకారం భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో లోగోలో సాంకేతిక కారణాల వల్ల పాక్ పేరు కనిపించలేదు. అయితే, తదుపరి అన్ని ప్రసారాల్లో లోగోను సరిచేస్తామని తెలిపింది.

    Details

    రేపు పాక్, ఇండియా మ్యాచ్

    ఇప్పటికే ఫిబ్రవరి 21న అఫ్గానిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లలో లోగోను సరిగ్గా ప్రదర్శించామని ఐసీసీ ప్రస్తావించింది.

    ఇదిలా ఉంటే ఫిబ్రవరి 23న జరిగే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

    ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు మెరుగవుతాయి. పాక్ గెలవకపోతే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదముంది.

    ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలుపొందగా, పాక్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఈ మ్యాచ్ పాకిస్తాన్‌కి డూ ఆర్ డై సమరంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    పాకిస్థాన్
    ఛాంపియన్స్ ట్రోఫీ
    ఇండియా

    తాజా

    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్

    ఐసీసీ

    ICC Hall of Fame: భారత మహిళా క్రికెటర్‌కు ఐసీసీ ప్రతిష్ఠాత్మక గౌరవం క్రికెట్
    ICC: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. 'స్పెషల్-20లోకి దిగ్గజ బ్యాటర్లు టీమిండియా
    Champions Trophy 2025: పాక్ బోర్డుకు ఊహించని ఎదురుదెబ్బ.. 'దిల్లీ' ప్రతిపాదన కుదరదన్న బీసీసీఐ  బీసీసీఐ
    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ చర్చలు.. రద్దయ్యే ఛాన్స్? పాకిస్థాన్

    పాకిస్థాన్

    UAE : యూఏఈ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీ నిలిపివేత ప్రపంచం
    Pakistan: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 12 మంది సైనికులు మృతి  అంతర్జాతీయం
    Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదలకు పోరాటం.. పాకిస్థాన్‌లో భారీ నిరసనలు ప్రపంచం
    Pakistan: పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీగా నిరసనలు.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి అంతర్జాతీయం

    ఛాంపియన్స్ ట్రోఫీ

    Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్ టీమిండియా
    Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం క్రీడలు
    Rohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ  రోహిత్ శర్మ
    Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..! క్రీడలు

    ఇండియా

    Madhya Pradesh: నలుగురు పిల్లల్ని కనే వారికి రూ. 1 లక్ష.. మధ్యప్రదేశ్ బోర్డు ప్రకటన మధ్యప్రదేశ్
    Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం ఉత్తర్‌ప్రదేశ్
    Scarlet fever: పిల్లలు జాగ్రత్త.. హైద‌రాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న స్కార్లెట్ ఫీవ‌ర్ కేసులు హైదరాబాద్
    Naval Ships:భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025