NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ODI World Cup 2025: ఐసీసీ ఉమెన్స్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025కి అర్హత సాధించిన పాకిస్తాన్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    ODI World Cup 2025: ఐసీసీ ఉమెన్స్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025కి అర్హత సాధించిన పాకిస్తాన్ 
    ఐసీసీ ఉమెన్స్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025కి అర్హత సాధించిన పాకిస్తాన్

    ODI World Cup 2025: ఐసీసీ ఉమెన్స్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025కి అర్హత సాధించిన పాకిస్తాన్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 18, 2025
    11:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 మహా టోర్నీ జరగనుంది.

    సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమిస్తోంది.

    పాకిస్థాన్ మహిళల జట్టు ఫాతిమా సనా నాయకత్వంలో ఈప్రపంచకప్‌కు అర్హత పొందింది.

    క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో థాయిలాండ్‌ను 87 పరుగుల తేడాతో ఓడించి పాక్ జట్టు మెగా టోర్నీలోకి ప్రవేశించింది.

    క్వాలిఫయర్ దశలో పాక్ నాలుగు మ్యాచ్‌లు ఆడి, అన్నింటిలోనూ విజయం సాధించింది.

    ఈ విజయాలతో పాక్ 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌కి అర్హత సాధించిన నేపథ్యంలో టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఐసీసీ యోచనలో ఉంది.

    అయితే,పాకిస్థాన్ జట్టు పాల్గొనే మ్యాచ్‌లు ఏదేశంలో నిర్వహించబడతాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

    వివరాలు 

    వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా మెగా టోర్నీలో 

    ఈ మెగా టోర్నీలో భారత్ ఆతిథ్య దేశంగా పాల్గొననుండగా, ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచి నేరుగా అర్హత సాధించాయి.

    క్వాలిఫయర్స్‌లో విజయం సాధించి పాకిస్థాన్ అర్హత పొందగా,మరో స్థానం కోసం బంగ్లాదేశ్,వెస్టిండీస్, స్కాట్‌లాండ్ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.

    ఇక మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వగా, భద్రతా సమస్యల నేపథ్యంలో బీసీసీఐ తమ జట్టును పాక్‌కు పంపలేమని ఐసీసీకి స్పష్టంగా తెలిపింది.

    దీనిపై చర్చల అనంతరం,ఐసీసీ సమక్షంలో బీసీసీఐ, పీసీబీ మధ్య హైబ్రిడ్ మోడ్‌ అమలు చేసేందుకు అంగీకారం కుదిరింది.

    దీంతో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు,భవిష్యత్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తటస్థ వేదికలపైనే తలపడే అవకాశముంది.

    వివరాలు 

    పాక్ ఆడే మ్యాచ్‌లు బంగ్లాదేశ్, శ్రీలంక లేదా యూఏఈలో.. 

    ఇప్పుడు పాకిస్థాన్ మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ 2025కు అర్హత సాధించిన నేపథ్యంలో, భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ కూడా హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించనున్నారు.

    పాక్ ఆడే మ్యాచ్‌లు బంగ్లాదేశ్, శ్రీలంక లేదా యూఏఈలో ఏ వేదికపై నిర్వహించనున్నారన్నది త్వరలో తేలనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పాకిస్థాన్

    Mohammed Shami: భారత జట్టుకు బ్యాడ్‌న్యూస్.. మైదానాన్ని వీడిన స్టార్ బౌలర్ భారత జట్టు
    Pakistan - Bangladesh: 53 ఏళ్ల తర్వాత పాక్-బంగ్లా మధ్య ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభం బంగ్లాదేశ్
    IND vs PAK: విజృంభించిన బౌలర్లు.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం టీమిండియా
    IND vs PAK: శతకొట్టిన విరాట్ కోహ్లీ.. పాక్‌పై టీమిండియా ఘన విజయం టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025