NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: పంత్‌కు రూ.12 లక్షల జరిమానా.. దిగ్వేశ్‌కు రెపీట్ పెనాల్టీ షాక్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: పంత్‌కు రూ.12 లక్షల జరిమానా.. దిగ్వేశ్‌కు రెపీట్ పెనాల్టీ షాక్!
    పంత్‌కు రూ.12 లక్షల జరిమానా.. దిగ్వేశ్‌కు రెపీట్ పెనాల్టీ షాక్!

    IPL 2025: పంత్‌కు రూ.12 లక్షల జరిమానా.. దిగ్వేశ్‌కు రెపీట్ పెనాల్టీ షాక్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 05, 2025
    12:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబయి ఇండియన్స్‌ను చిత్తు చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ కు షాక్‌ తగిలింది.

    ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్‌, యువ స్పిన్నర్ దిగ్వేశ్‌ రాఠికి జరిమానా విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది.

    లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఏకనా స్టేడియం వేదికగా మ్యాచ్‌ జరిగింది.

    పంత్‌కు రూ.12 లక్షలు జరిమానా విధించగా.. యువ బౌలర్ దిగ్వేశ్‌ వరుసగా రెండోసారి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఆగ్రహానికి గురికావడం గమనార్హం. రిషభ్‌ పంత్‌కు జరిమానా విధించాం. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

    ఆర్టికల్ 2.22 ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్ ప్రకారం పంత్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధించామని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తెలిపింది.

    Details

    దిగ్వేశ్‌ ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు

    ఐపీఎల్ 2025 సీజన్‌లో 'స్లో ఓవర్ రేట్‌' కారణంగా జరిమానా ఎదుర్కొన్న మూడో సారథి రిషభ్‌ పంత్‌. ఇంతకుముందు హార్దిక్ పాండ్య, రియాన్‌ పరాగ్‌పై ఫైన్‌ పడింది.

    దిగ్వేశ్‌ ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ముంబయిపై లఖ్‌నవూ విజయం సాధించడంలో దిగ్వేశ్‌ రాఠి (Digvesh Rathi) కీలక పాత్ర పోషించాడు.

    నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఒక్క వికెట్ తీసి 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

    కీలకమైన నమన్ ధీర్ (46)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

    అయితే, నమన్‌ను ఔట్ చేసిన తర్వాత కూడా 'సంతకం' చేసినట్లుగా సంబరాలు నిర్వహించడంపై మ్యాచ్‌ రిఫరీ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

    Details

    మ్యాచులో 50శాతం జరిమానా

    ఆర్టికల్ 2.5 కోడ్‌ ఆఫ్‌ కండక్ట్ లెవెల్ 1 నేరం కిందకు వస్తుందని.. దీంతో అతడి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు కమిటీ వెల్లడించింది.

    ఇప్పటికే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఇలానే వ్యవహరించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఒక డీమెరిట్ పాయింట్ వచ్చింది.

    ఇప్పుడీ ఘటనతో మరో రెండు డీమెరిట్‌ పాయింట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉన్నట్లైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రిషబ్ పంత్
    లక్నో సూపర్‌జెయింట్స్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    రిషబ్ పంత్

    IPL 2023: గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్..! క్రికెట్
    IPL 2023: రిషబ్ పంత్ ప్లేస్‌లో రానున్న అభిషేక్ పోరెల్! ఇంతకీ అభిషేక్ పోరెల్ ఎవరు? ఐపీఎల్
    IPL 2023: అభిమానులకు గుడ్‌న్యూస్.. నేడు స్టేడియంలోకి రిషబ్ పంత్ క్రికెట్
    అండర్ 16 ఆటగాళ్లతో ముచ్చటించిన రిషబ్ పంత్ క్రికెట్

    లక్నో సూపర్‌జెయింట్స్

    IPL 2023: స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయిన రాజస్థాన్.. లక్నోదే గెలుపు  ఐపీఎల్
    లక్నో చేతిలో ఓడినా.. రాజస్థానే నంబర్ వన్..! క్రీడలు
    IPL 2023: గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్
    IPL 2023: రసవత్త పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం గుజరాత్ టైటాన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025