
Rishabh Pant: సరికొత్త రికార్డు సృష్టించిన రిషబ్ పంత్.. ధోనీ రికార్డు బద్దలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాటర్లు చెలరేగారు. సెంచరీలతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. యశస్వీ జైస్వాల్ (101) శతకంతో రాణించగా, కెప్టెన్ శుభ్మన్ గిల్ 127 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రాహుల్ (42) మంచి ఇన్నింగ్స్ ఆడగా, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అర్ధశతకాన్ని పూర్తి చేసి 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొత్తానికి తొలి రోజు భారత్ యువ బ్యాటర్లు సత్తా చాటారు. ఇంగ్లాండ్ జట్టుపై పూర్తి ఆధిపత్యం కనబరిచారు. అదే సమయంలో రిషబ్ పంత్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Details
65 పరుగులతో నాటౌట్ గా నిలిచిన రిషబ్ పంత్
ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ అద్భుత రికార్డును నమోదు చేశాడు. లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో పంత్ అర్ధశతకాన్ని పూర్తి చేసి శుభ్మన్ గిల్తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పంత్ 65 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించాడు. టెస్టు క్రికెట్లో 3వేల పరుగులు చేసిన రెండో భారత వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు.
Details
వేగంగా 3వేల పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లు
టెస్టు క్రికెట్లో ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 3వేల పరుగులను పూర్తి చేసిన వికెట్ కీపర్గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఉన్నాడు. ఆయన 63 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని చేరగా, రిషబ్ పంత్ 76 ఇన్నింగ్స్ల్లో సాధించాడు. కుమార సంగక్కర (78 ఇన్నింగ్స్), ఆండీ ఫ్లవర్ (78 ఇన్నింగ్స్) పంత్ తరువాత ఉన్నారు. అంతేకాకుండా ఎంఎస్ ధోనీ (144 ఇన్నింగ్స్లో 4876 పరుగులు) తరువాత టెస్టు క్రికెట్లో 3వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత వికెట్ కీపర్ బ్యాట్స్మన్గా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. 27 ఏళ్ల పంత్ ఈ క్రమంలో కుమార సంగక్కరను అధిగమించి, 3వేల పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన ఆసియా వికెట్ కీపర్ అయ్యాడు.