NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025 Auction:  రియాద్‌లో ఐపీఎల్‌ 2025 మెగా వేలం.. వేదిక, డేట్లు ఇవేనా?
    తదుపరి వార్తా కథనం
    IPL 2025 Auction:  రియాద్‌లో ఐపీఎల్‌ 2025 మెగా వేలం.. వేదిక, డేట్లు ఇవేనా?

    IPL 2025 Auction:  రియాద్‌లో ఐపీఎల్‌ 2025 మెగా వేలం.. వేదిక, డేట్లు ఇవేనా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 04, 2024
    02:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది.

    ఫ్రాంచైజీలు గరిష్ఠంగా ఆరుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అందువల్ల రైట్‌ టు మ్యాచ్‌ ఆప్షన్‌ లేకుండా పోయింది.

    ఈ సందర్భంగా మిగిలిన ఆటగాళ్లను మెగా వేలంలో తిరిగి కొనుగోలు చేయాలని జట్లు సిద్ధమవుతున్నాయి.

    వచ్చే మూడేళ్ల కాలానికి తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అయితే, ఈ మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనేది ప్రస్తుతానికి హాట్ టాపిక్‌ గా మారింది.

    వివరాలు 

    నవంబర్ 24, 25 తేదీల్లో వేలం నిర్వహించే ఛాన్స్

    గతంలో దుబాయ్‌ వేదికగా నిర్వహించిన ఐపీఎల్ వేలం ఈ సారి మాత్రం సౌదీ అరేబియా రాజధాని రియాద్ వేదికగా జరిగే అవకాశం ఉందని సమాచారం.

    నవంబర్ 24, 25 తేదీల్లో వేలం నిర్వహించే ఛాన్స్ ఉందని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి, కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

    ఇక నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమవుతుండటంతో, ఈ టెస్టు మధ్యలోనే ఐపీఎల్ వేలం నిర్వహించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    డిస్నీ హాట్‌స్టార్‌లో వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రియాద్‌లో మధ్యాహ్నం సమయంలో వేలం నిర్వహించడంతో ఆస్ట్రేలియా టైమింగ్‌ కు ఇబ్బంది లేకుండా చూసుకుంటారని సమాచారం.

    వివరాలు 

    రిషభ్ పంత్‌పైనే  అందరి దృష్టి

    ఈసారి వేలం పై ఆసక్తి పెరిగిపోవడానికి ప్రధాన కారణం భారత స్టార్ ఆటగాళ్లు ఇందులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడమే.

    రిషభ్‌ పంత్,కేఎల్ రాహుల్,శ్రేయస్‌ అయ్యర్,అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, సిరాజ్ వంటి పలువురు ఆటగాళ్లు అందుబాటులో ఉండటంతో అభిమానులు వీరి పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ముఖ్యంగా రిషభ్ పంత్‌ను ఎవరు తీసుకుంటారనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

    అతడికి కనీసం రూ. 25 కోట్ల బిడ్డింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ రూ. 50 కోట్ల బిడ్డింగ్ వచ్చే అవకాశం ఉందని అంటుండగా, భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కూడా కేఎల్ రాహుల్ రూ. 20 నుంచి రూ. 25 కోట్ల రేంజ్‌లో ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఐపీఎల్

    IPL 2024- RR Team-Dhruv Jurel: ఐపీఎల్ లో దూసుకుపోతున్న ఆర్ ఆర్ జట్టు..నాన్నకే సెల్యూట్ చేశా: ధ్రువ్ జురెల్ క్రికెట్
    Actress Thamanna-IPL Streaming Case: షూటింగ్ ఉంది...విచారణకు రాలేను: సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపిన తమన్నా భాటియా తమన్నా
    IPL-Lucknow-Mumbai Indians-Play off: హ్యాట్రిక్​ ఓటములతో ఐపీఎల్​ ప్లే ఆఫ్​ అవకాశాలను కోల్పోయిన ముంబై ఇండియన్స్​ జట్టు ముంబయి ఇండియన్స్
    Kalki-Bhairava-Prabhas-Promotions-IPL: సరికొత్త గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన కల్కి టీమ్..ఐపీఎల్ మధ్యలో భైరవగా వచ్చిన ప్రభాస్ కల్కి 2898 AD
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025