NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఐర్లాండ్ టూర్‌కు టీమిండియా
    తదుపరి వార్తా కథనం
    వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఐర్లాండ్ టూర్‌కు టీమిండియా
    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ

    వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఐర్లాండ్ టూర్‌కు టీమిండియా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 28, 2023
    12:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా, వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లు ఆడనుంది. ఆ సిరీస్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ పర్యటనలో టీమిండియా మూడు టీ20 సిరీస్ లను ఆడనుంది.

    వెస్టిండీస్ సిరీస్ కోసం ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించగా, టీ20 సిరీస్‌కు మాత్రమే ఇంకా జట్టును ప్రకటించలేదు.

    అయితే భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ ఆగస్టు 18న ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్ ఆగస్టు 23న జరగనుంది. డబ్లిన్ శివారులోని మలహైడ్ క్రికెట్ క్లబ్ స్టేడియంలోనే ఈ మూడు మ్యాచులు జరగనున్నాయి.

    గతేడాది ఐర్లాండ్ పర్యటించిన టీమిండియా జట్టు రెండు టీ20లను ఆడి సిరీస్ ను క్లిన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

    Details

    భారత జట్టు రెండోసారి రావడం సంతోషంగా ఉంది : డ్యూట్రోమ్

    12 నెలల్లో రెండోసారి ఐర్లాండ్ కు వస్తున్న భారత జట్టుకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందని క్రికెట్ ఐర్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ డ్యూట్రోమ్ పేర్కొన్నారు.

    భారత జట్టు నిరంతరం పర్యటనల్లో ఉన్నప్పటికీ ఐర్లాండ్ సిరీస్ ను పరిగణలోకి తీసుకున్నందుకు కృతజ్ఞతలని, పెద్ద సంఖ్యలో అభిమానులు మ్యాచును చూసేందుకు వీలు కల్పిస్తోందని అతను పేర్కొన్నాడు.

    అయితే ఐర్లాండ్ పర్యటకు టీమిండియా కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు.

    ఈ పర్యటనలో బీసీసీఐ యువ ప్లేయర్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐర్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు వరల్డ్ కప్ ఆడనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌    కేంద్ర ప్రభుత్వం
    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు

    టీమిండియా

    రవిచంద్రన్ అశ్విన్ మాములోడు కాదు.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్! రవిచంద్రన్ అశ్విన్
    యాషెస్ సమరానికి సర్వం సిద్ధం.. ఎక్కువ సిరీస్‌లు గెలిచిందే వీరే..? యాషెస్ సిరీస్
    రోహిత్ శర్మ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరో చెప్పేసిన గూగుల్ ఏఐ! రోహిత్ శర్మ
    వెస్టిండీస్ టూరులో భారీ మార్పులు.. టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా, టీ20ల్లోకి మోహిత్ శర్మ రీఎంట్రీ! క్రికెట్

    క్రికెట్

    మినీ ఐపీఎల్ వచ్చేసింది.. టైటిల్ వేటలో సీఎస్కే, కేకేఆర్, ముంబై, ఢిల్లీ ప్రపంచం
    హాంకాంగ్‌ను ఓడించిన భారత మహిళల జట్టు ఉమెన్ టీ20 సిరీస్
    ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై..? సీఎస్కే ఎమోషనల్ పోస్టుతో ఫ్యాన్స్ ఆందోళన ఎంఎస్ ధోని
    సౌత్ జోన్ జట్టు కెప్టెన్‌గా హనుమ విహారి, వైస్ కెప్టెన్‌గా మయాంక్ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025