NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ?
    సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ?

    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    08:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌పై అసంతృప్తి నెలకొంది.

    తాజాగా గురువారం ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌ అర్థాంతరంగా రద్దయ్యింది.

    భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.

    మ్యాచ్ రద్దు నేపథ్యంలో బీసీసీఐ అత్యవసరంగా సమావేశమై, టోర్నీ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనుంది.

    పాకిస్థాన్ మిస్సైల్ దాడుల నేపథ్యంలో టోర్నీ నిర్వహణ కష్టంగా మారినట్లు బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.

    పరిస్థితిని బట్టి ఐపీఎల్ 2025ను తాత్కాలికంగా వాయిదా వేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం వంటి ఎంపికలను బోర్డు పరిశీలిస్తోంది.

    Details

    భద్రతే ప్రథమ ప్రాధాన్యత: దేవజిత్ సైకియా

    ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు.

    ధర్మశాలలో మ్యాచ్‌ నిర్వహణ ప్రమాదకరమని అంచనా వేసి, రద్దు చేయాల్సి వచ్చింది.

    ప్రస్తుతం పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆటగాళ్లు, ప్రేక్షకులు, సపోర్ట్ స్టాఫ్ భద్రతే మాకు ముఖ్యమైంది.

    దేశ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి సిద్ధం. పరిస్థితిని తక్కువచేసి చూడడం లేదు. భద్రతా అంశాల ప్రకారమే టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

    Details

    'ఆపరేషన్ సిందూర్' నేపథ్యం 

    గత నెల 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు మంగళవారం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టాయి.

    పాకిస్థాన్‌ శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించగా, దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం.

    ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్'గా నామకరణం చేశారు. భారత్‌లో మహిళల సింధూరాన్ని నేలకూల్చిన దాడికి బదులుగా ఈ చర్య చేపట్టారని అధికారులు తెలిపారు.

    Details

    పాక్ ప్రతిదాడి ప్రయత్నాలు 

    ఆపరేషన్ సిందూర్‌కి ప్రతీకారంగా పాకిస్థాన్‌ మిస్సైల్ దాడులకు పాల్పడుతుంది.

    అయితే భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, పాక్ ప్రయోగించిన మిస్సైల్‌ను గాల్లోనే నిర్వీర్యం చేసింది.

    అంతేకాకుండా లాహోర్‌లోని కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేయడమేగాక, మూడు పాకిస్థాన్ యుద్ధవిమానాలను కూల్చివేసింది.

    ఈ ఉద్రిక్తతల మధ్య, భారత ప్రభుత్వం ధర్మశాల, అమృత్‌సర్, ఛండీగడ్, జమ్మూ, శ్రీనగర్‌ సహా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసింది.

    ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్‌ 2025పై ఆందోళన నెలకొన్నది. బీసీసీఐ త్వరలోనే సీజన్‌పై తుది ప్రకటన చేయనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    ఐపీఎల్
    ఇండియా
    పాకిస్థాన్

    తాజా

    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ
    MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం తెలంగాణ
    Operation Sindoor: భారత్‌-పాక్‌ మధ్య యుద్ధంలో జోక్యం చేసుకోబొం: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అమెరికా
    Harrop Drone: ఇజ్రాయెల్‌ తయారీ దీర్ఘశ్రేణి లాయిటరింగ్‌ మ్యునిషన్‌ 'హారప్‌'.. భారత అమ్ములపొదిలో మెగా అస్త్రం  భారతదేశం

    బీసీసీఐ

    Devjit Saikia: బీసీసీఐ నూతన కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా బాధ్యతల స్వీకరణ ఐసీసీ
    IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ  ఐపీఎల్
    BCCI Pay Cuts: ఆటగాళ్ల పేమెంట్‌లో కోత.. టీమిండియా ఫలితాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం టీమిండియా
    BCCI: ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్‌ విషయంలో బీసీసీఐ కఠిన చర్యలు.. టీమిండియాలో మళ్లీ యో యో టెస్టు..!  క్రీడలు

    ఐపీఎల్

    RCB-PBKS:  సొంత గడ్డపై చతికిల పడిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 5 వికెట్ల తేడాతో  పంజాబ్ కింగ్స్ గెలుపు  క్రీడలు
    RR Vs LSG: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నేడు లక్నోతో రాజస్థాన్ రాయల్స్ పోరు..  క్రీడలు
    IPL 2025: ఐపీఎల్‌-18లో యువ ఆటగాళ్లు దూకుడుపై ప్రత్యేక కథనం క్రీడలు
    IPL 2025: 14 ఏళ్లలోనే ఐపీఎల్‌లో దుమ్మురేపిన వైభవ్.. అతని తర్వాత ఎవరున్నారంటే? క్రికెట్

    ఇండియా

    Kunal Kamra: కునాల్ కమ్రాకు బిగ్ షాక్.. బుక్ మై షో జాబితా నుంచి తొలగింపు మహారాష్ట్ర
    Visakhapatnam: భూ వినియోగంపై వివాదం.. రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ నోటీసులు  విశాఖపట్టణం
    MA Baby: వామపక్ష పార్టీకి నూతన సారధి.. సీపీఎం చీఫ్‌గా ఎం.ఎ.బేబీ ఎంపిక కేరళ
    Krishna river: శ్రీరామనవమి రోజే విషాదం.. కృష్ణా నదిలో దిగి ముగ్గురు బాలురు మృతి కృష్ణా జిల్లా

    పాకిస్థాన్

    #NewsBytesExplainer: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ భారతదేశంపై సైబర్ యుద్ధం ఎలా చేస్తోందో తెలుసా? భారతదేశం
    Big Standoff at Attari: సొంతదేశ ప్రజల్ని అనుమతించని పాకిస్తాన్.. అట్టారీ-వాఘా వద్ద ఉద్రిక్తత భారతదేశం
    Pahalgam Terror Attack:'ఇది రహస్యం అని నేను అనుకోను': ఉగ్రవాదులతో ఇస్లామాబాద్ సంబంధాలు నిజమే కానీ.. అంగీకరించిన బిలావల్ భుట్టో  అంతర్జాతీయం
    India-Pakistan: ఉగ్రవాద నిధులను అరికట్టడానికి పాకిస్తాన్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్‌..?  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025