Page Loader
టీమిండియాతో టెస్టు సిరీస్.. స్పెషల్ ఫోకస్ పెట్టిన విండీస్!
ముందుగానే స్వదేశానికి చేరుకోనున్న అల్జారీ జోసెఫ్, జాసన్ హోల్డర్

టీమిండియాతో టెస్టు సిరీస్.. స్పెషల్ ఫోకస్ పెట్టిన విండీస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2023
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

జింబాబ్వే వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచుల్లో నిరాశపరిచిన వెస్టిండీస్, వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించకలేపోయింది. స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలైన విండీస్ అధికారికంగా వన్డే వరల్డ్ కప్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. క్వాలిఫయర్స్‌లో విండీస్‌కు ఇంకా రెండు మ్యాచులు మిగిలి ఉన్నాయి. జులై 5న ఒమన్, శ్రీలంకతో నామమాత్రపు మ్యాచులు ఆడనుంది. స్వదేశంలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు కరీబియన్ జట్టు సిద్ధం కానుంది. త్వరలో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం స్టార్ ఆటగాళ్లు జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్ లను ముందుగానే స్వదేశానికి విండీస్ క్రికెట్ బోర్డు రప్పించింది.

Details

జూలై 12 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం

ఈ నేపథ్యంలో జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్ ఒమన్, శ్రీలంక తో జరిగే చివరి క్వాలిఫయర్ మ్యాచులకు దూరమయ్యారు. టీమిండియాతో టెస్టు సిరీస్‌కు వారిపై ఒత్తిడి తగ్గించేందుకు విండీస్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విండీస్ జట్టు ప్రస్తుతం ట్రినిడాడ్‌లో ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది. కాగా జూలై 12 నుంచి డెమినికా వేదికగా టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది భారత్‌తో టెస్టులకు వెస్టిండీస్ సన్నహాక జట్టు బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, బోనర్, చంద్రపాల్, కార్న్వాల్, జాషువా డా సిల్వా, గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, రోచ్, సీల్స్, జోమెల్ వారికన్.