NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy: ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. సీనియర్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుందా? 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy: ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. సీనియర్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుందా? 
    ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. సీనియర్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుందా?

    Champions Trophy: ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. సీనియర్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుందా? 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 18, 2025
    09:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరుగుతున్న వివాదాలు, బీసీసీఐ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

    నిపుణుల నుంచి సామాన్య అభిమానుల వరకూ ఈ అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇవాళ భారత జట్టు ప్రకటించనుంది.

    ఇప్పటికే 6 జట్లు తమ జట్లు ప్రకటించగా, భారత్, పాకిస్తాన్ జట్లు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

    ఇవాళ ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ సమావేశమవుతోంది.

    ఈ సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఎంపిక చేయనున్నారు.

    Details

    ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభం

    ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్‌లలో ప్రారంభమవుతుంది.

    టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. భారత జట్టు తమ మ్యాచ్‌లన్నింటిని దుబాయ్‌లో ఆడనుంది.

    ప్రస్తుతం ఏ ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదిస్తారనే అంశంపై అందరి దృష్టి నిలిచింది.

    కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్ల పేలవమైన ఫామ్, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లపై ఎక్కువ చర్చ జరుగుతోంది.

    చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ శనివారం ముంబైలో సమావేశమవుతుంది.

    Details

    వన్డే సిరీస్ కోసం కూడా జట్టును ప్రకటించే అవకాశం 

    జట్టు ఎంపిక ప్రక్రియలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయాలు కూడా కీలకంగా మారనున్నాయి.

    ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కోచ్, కెప్టెన్, సెలక్షన్ కమిటీ మధ్య విభేదాలు బయటపడినందున ఈ సమావేశం మరింత ప్రత్యేకంగా మారింది.

    ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుతో పాటు, ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ జట్టును కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది.

    ఈ సిరీస్‌కు ఎంపికయ్యే ఆటగాళ్ల జాబితా, ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల స్థానం, చాలా ఆసక్తికరంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత జట్టు
    రోహిత్ శర్మ
    గౌతమ్ గంభీర్
    బీసీసీఐ

    తాజా

    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    Fat burning: వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయం ఈ 5 అలవాట్లు పాటించండి జీవనశైలి
    Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ  గుజరాత్ టైటాన్స్

    భారత జట్టు

    శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు క్రికెట్
    వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ క్రికెట్
    భారత్ 48 ఏళ్ల కల నెరవేరేనా..? ప్రపంచం
    రాహుల్ ఐదో స్థానానికి ఫర్‌ఫెక్ట్..! క్రికెట్

    రోహిత్ శర్మ

    Ceat Awards: రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌కు క్రికెట్‌ అత్యున్నత అవార్డులు ప్రధానం  క్రీడలు
    Ind Vs Ban: బంగ్లాదేశ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు లేవు :  రోహిత్ శర్మ   క్రీడలు
    Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా అరుదైన ఘనత టీమిండియా
    Chess Olympiad 2024: రోహిత్ శర్మ స్టైల్‌లో చెస్ ఛాంపియన్ల సంబరాలు చెస్

    గౌతమ్ గంభీర్

    Virat Vs Gambhir: నా కళ్లకంటిన మట్టితో సమానం.. గొడవ ఇక్కడే మొదలైంది! విరాట్ కోహ్లీ
    ధోనీ వల్ల ఆ రెండు వరల్డ్ కప్‌లను గెలవలేదు.. యువరాజ్ వల్లే గెలిచాం : గంభీర్ ఎంఎస్ ధోని
    Tilak Varma: గౌతమ్ గంభీర్ రికార్డును బ్రేక్ చేసిన తిలక్ వర్మ  తిలక్ వర్మ
    ధోని గురించే మాట్లాడుతారు.. యువీకి క్రెడిట్ ఇవ్వడం లేదు : గౌతమ్ గంభీర్ యువరాజ్ సింగ్

    బీసీసీఐ

    BCCI: దేశవాళీ క్రికెట్‌లోనూ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డులను అందజేస్తాం: జే షా  క్రీడలు
    BCCI's AGM: సెప్టెంబర్ 29న BCCI ఏజీఎం.. NCA ప్రారంభోత్సవం క్రీడలు
    IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టులో షమీ-శ్రేయస్‌కు ఎందుకు అవకాశం దక్కలేదంటే? టీమిండియా
    AFG vs NZ: మ్యాచ్ రద్దు.. నోయిడాలో టెస్టు మ్యాచ్‌పై అప్గాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025