NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: హోమ్ టీమ్​కు చేరుకున్న ఐపీఎల్ స్టార్స్ ఎవరంటే?
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: హోమ్ టీమ్​కు చేరుకున్న ఐపీఎల్ స్టార్స్ ఎవరంటే?
    హోమ్ టీమ్​కు చేరుకున్న ఐపీఎల్ స్టార్స్ ఎవరంటే?

    IPL 2025: హోమ్ టీమ్​కు చేరుకున్న ఐపీఎల్ స్టార్స్ ఎవరంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    03:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సౌదీలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలం చాలా ఆసక్తికరంగా సాగింది.

    క్రికెట్ ప్రేమికులు అనేక ఊహించని పరిణామాలను సాక్షాత్కరించారు. కొందరు ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోగా, మరికొందరు భారీ ధరకు కొత్త జట్లలో చేరారు.

    కొన్ని గణనీయమైన పేర్లు మళ్లీ తమ పాత జట్లకు చేరడం మరింత ఉత్కంఠను కలిగించింది. ఆ కీలక వివరాలు ఇప్పుడు చూద్దాం.

    వివరాలు 

    రవిచంద్రన్ అశ్విన్ 

    గత ఏడాది రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రవిచంద్రన్ అశ్విన్‌ను ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. 10 సంవత్సరాల విరామం తర్వాత అశ్విన్ తిరిగి చెన్నై టీమ్‌లో చేరడం ఈ జట్టు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది.

    జోఫ్రా ఆర్చర్

    ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ చివరి క్షణంలో వేలంలోకి వచ్చి ఏకంగా రూ. 12.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్‌కు అమ్ముడయ్యాడు. 2018లో ఈ జట్టుతో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆర్చర్ మళ్లీ నాలుగేళ్ల విరామం తర్వాత పింక్ టీమ్‌లో చేరి అభిమానులను ఆనందపరిచాడు.

    వివరాలు 

    ట్రెంట్ బౌల్ట్ 

    న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను ముంబయి ఇండియన్స్ ఈసారి రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. 2020లో ముంబయి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బౌల్ట్, కొంతకాలం విరామం తర్వాత మళ్లీ ముంబయి జట్టులో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

    గ్లెన్ మ్యాక్స్‌వెల్

    ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 10 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్‌కు చేరాడు. ఈసారి పంజాబ్ అతడ్ని రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది.

    వివరాలు 

    సామ్ కరన్ 

    2020లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సామ్ కరన్, మళ్లీ అదే జట్టులోకి చేరాడు. ఈసారి చెన్నై అతడ్ని రూ. 2.40 కోట్లకు తీసుకుంది.

    భువనేశ్వర్ కుమార్

    గతేడాది సన్‌ రైజర్స్ హైదరాబాద్ తరఫున రాణించిన భువనేశ్వర్ కుమార్, ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు. ఆర్సీబీ అతడ్ని రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. 2009లో ఐపీఎల్‌లో ఆర్సీబీ ద్వారానే అరంగేట్రం చేసిన భువనేశ్వర్ మళ్లీ అదే జట్టుకు చేరడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్

    తాజా

    Harvard University: మరోసారి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి మరో 450 మిలియన్‌ గ్రాంట్ల కోత అమెరికా
    Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు..  స్టాక్ మార్కెట్
    Mohammed Shami : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌.. మండిపడ్డ మహ్మద్‌ షమీ..! మహ్మద్ షమీ
    UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం  ద్రౌపది ముర్ము

    ఐపీఎల్

    MS Dhoni : ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై సీఎస్కే సీఈవో క్లారిటీ.. అక్టోబర్ 31న తేలనున్న సస్పెన్స్! ఎంఎస్ ధోని
    KL Rahul: ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీకి ముప్పు.. లక్నో కీలక నిర్ణయం! లక్నో సూపర్‌జెయింట్స్
    IPL Retention : ఢిల్లీ కెప్టెన్సీలో మార్పు .. మెగా వేలంలోకి పంత్! కన్నేసిన మూడు టీమ్స్ రిషబ్ పంత్
    Washington Sundar: అద్భుత ఆటతో దూసుకుపోతున్న వాషింగ్టన్ సుందర్.. సీనియర్ల నుంచి ప్రశంసలు వాషింగ్టన్ సుందర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025