Page Loader
IPL 2025: హోమ్ టీమ్​కు చేరుకున్న ఐపీఎల్ స్టార్స్ ఎవరంటే?
హోమ్ టీమ్​కు చేరుకున్న ఐపీఎల్ స్టార్స్ ఎవరంటే?

IPL 2025: హోమ్ టీమ్​కు చేరుకున్న ఐపీఎల్ స్టార్స్ ఎవరంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2024
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలం చాలా ఆసక్తికరంగా సాగింది. క్రికెట్ ప్రేమికులు అనేక ఊహించని పరిణామాలను సాక్షాత్కరించారు. కొందరు ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోగా, మరికొందరు భారీ ధరకు కొత్త జట్లలో చేరారు. కొన్ని గణనీయమైన పేర్లు మళ్లీ తమ పాత జట్లకు చేరడం మరింత ఉత్కంఠను కలిగించింది. ఆ కీలక వివరాలు ఇప్పుడు చూద్దాం.

వివరాలు 

రవిచంద్రన్ అశ్విన్ 

గత ఏడాది రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రవిచంద్రన్ అశ్విన్‌ను ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. 10 సంవత్సరాల విరామం తర్వాత అశ్విన్ తిరిగి చెన్నై టీమ్‌లో చేరడం ఈ జట్టు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ చివరి క్షణంలో వేలంలోకి వచ్చి ఏకంగా రూ. 12.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్‌కు అమ్ముడయ్యాడు. 2018లో ఈ జట్టుతో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆర్చర్ మళ్లీ నాలుగేళ్ల విరామం తర్వాత పింక్ టీమ్‌లో చేరి అభిమానులను ఆనందపరిచాడు.

వివరాలు 

ట్రెంట్ బౌల్ట్ 

న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను ముంబయి ఇండియన్స్ ఈసారి రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. 2020లో ముంబయి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బౌల్ట్, కొంతకాలం విరామం తర్వాత మళ్లీ ముంబయి జట్టులో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 10 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్‌కు చేరాడు. ఈసారి పంజాబ్ అతడ్ని రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది.

వివరాలు 

సామ్ కరన్ 

2020లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సామ్ కరన్, మళ్లీ అదే జట్టులోకి చేరాడు. ఈసారి చెన్నై అతడ్ని రూ. 2.40 కోట్లకు తీసుకుంది. భువనేశ్వర్ కుమార్ గతేడాది సన్‌ రైజర్స్ హైదరాబాద్ తరఫున రాణించిన భువనేశ్వర్ కుమార్, ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు. ఆర్సీబీ అతడ్ని రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. 2009లో ఐపీఎల్‌లో ఆర్సీబీ ద్వారానే అరంగేట్రం చేసిన భువనేశ్వర్ మళ్లీ అదే జట్టుకు చేరడం విశేషం.