NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL Auction : నేడే ఐపీఎల్ మినీ వేలం.. జాక్‌పాట్ కొట్టేదెవరో?
    తదుపరి వార్తా కథనం
    IPL Auction : నేడే ఐపీఎల్ మినీ వేలం.. జాక్‌పాట్ కొట్టేదెవరో?
    నేడే ఐపీఎల్ మినీ వేలం.. జాక్‌పాట్ కొట్టేదెవరో?

    IPL Auction : నేడే ఐపీఎల్ మినీ వేలం.. జాక్‌పాట్ కొట్టేదెవరో?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 19, 2023
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ (IPL) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.

    నేడు మినీ ఐపీఎల్ వేలం జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఆక్షన్‌ను విదేశాల్లో నిర్వహిస్తున్నారు.

    దుబాయ్‌లోని కోకాకోలా అరీనా దీనికి వేదిక కానుంది. మొత్తం 333 మంది ఆటగాళ్లు బరిలో ఉన్నారు.

    ఇందులో 214 మంది భారత క్రికెటర్లు, 119 మంది విదేశీయుల్లో ఇద్దరు అసోసియేట్ దేశాల ఆటగాళ్లున్నారు.

    మొత్తం 10 జట్లు కలిపి గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

    ఈ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది.

    Details

    ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ పై ఎక్కువ ఆసక్తి

    ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్(రూ.2 కోట్లు) పైనా ప్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

    ఇక వన్డే వరల్డ్ కప్‌లో భారత్ పిచ్‌లపై చెలరేగిన దక్షిణాఫ్రికా పేసర్ కొయెట్జీ (రూ.2 కోట్లు)కి డిమాండ్ ఎక్కువగా ఉంది.

    శ్రీలంక స్పిన్‌ ఆల్‌రౌండర్‌ హసరంగ (రూ.1.50 కోట్లు), ట్రావిస్‌ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌, ఇంగ్లిస్‌, క్రిస్‌ వోక్స్‌, ఫెర్గూసన్‌, హేజిల్‌వుడ్‌ (రూ.2 కోట్లు)లపై ఫ్రాంఛైజీలు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాయి.

    హోల్డర్‌, నీషమ్‌ (రూ.1.50 కోట్లు), రోమన్‌ పావెల్‌, డరైల్‌ మిచెల్‌, బ్రేస్‌వెల్‌ (రూ.కోటి), మదుశంక, షంసి, కేశవ్‌ మహరాజ్‌ (రూ.50 లక్షలు) కోసం జట్లు పోటి పడే అవకాశముంది.

    Details

    అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.38.14 కోట్లు

    భారత్ ఆటగాళ్లలో శార్దూల్ ఠాకూర్(రూ.2 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.2 కోట్లు), షారుక్ ఖాన్ (రూ.40 లక్షలు) సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ (రూ.2 కోట్లు), కేఎస్ భరత్, మనీశ్ పాండే, సిద్దార్థ్ కౌల్ పై కాసుల వర్షం కురవనుంది.

    16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ లీగ్ వేలాన్ని తొలిసారిగా ఓ మహిళ నిర్వహించనున్నారు.

    అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.38.14 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.13.5 కోట్లు ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    క్రికెట్

    తాజా

    Air india Flight Crash: 'చాలా మంది ప్రయాణికులు మరణించారు'.. : విదేశాంగ శాఖ ప్రకటన విదేశాంగశాఖ
    2027 census: డిజిటల్ రూపంలో 2027 జనగణన.. జనగణన
    Boeing 787 Dreamliner: మరోసారి తెరపైకి బోయింగ్‌ విమానాల భద్రత అంశం.. డ్రీమ్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు!  బోయింగ్
    Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ.. ఈ ఏడాది నుంచే అందుబాటులోకి..  తెలంగాణ

    ఐపీఎల్

    ధోనీ క్రీజులోకి వచ్చాడు.. జియో సినిమాలో సరికొత్త రికార్డు ఎంఎస్ ధోని
    స్వీట్ మ్యాంగోస్‌తో నవీన్ ఉల్ హక్‌ను ట్రోల్ చేసిన ముంబై ప్లేయర్స్.. ఏం చేశారంటే! ముంబయి ఇండియన్స్
    ముంబై విజయం తర్వాత ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లో వచ్చిన మార్పులివే! క్రికెట్
    IPL 2023: మహమ్మద్ షమీ నుంచి రోహిత్‌కు గండం  రోహిత్ శర్మ

    క్రికెట్

    ICC World Cup 2023: ప్రపంచ కప్‌లో ఘోర వైఫల్యం.. ఆ జట్లపై భారీ ప్రభావం! వన్డే వరల్డ్ కప్ 2023
    'హాల్ ఆఫ్ ఫేమ్'లో డయానా ఎడుల్జీ.. మహిళా క్రికెట్ స్థాయిని పెంచిందన్న ఝలన్ గోస్వామి ఐసీసీ
    Abdul Razzaq: ఐశ్వర్యరాయ్‌కి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు చేయడం తప్పే : అబ్దుల్ రజాక్  పాకిస్థాన్
    Dilip: భారత ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపిన ఫీల్డింగ్ కోచ్.. మన తెలుగోడే! టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025