NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy 2025: పాక్ బోర్డుకు ఊహించని ఎదురుదెబ్బ.. 'దిల్లీ' ప్రతిపాదన కుదరదన్న బీసీసీఐ 
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy 2025: పాక్ బోర్డుకు ఊహించని ఎదురుదెబ్బ.. 'దిల్లీ' ప్రతిపాదన కుదరదన్న బీసీసీఐ 
    పాక్ బోర్డుకు ఊహించని ఎదురుదెబ్బ.. 'దిల్లీ' ప్రతిపాదన కుదరదన్న బీసీసీఐ

    Champions Trophy 2025: పాక్ బోర్డుకు ఊహించని ఎదురుదెబ్బ.. 'దిల్లీ' ప్రతిపాదన కుదరదన్న బీసీసీఐ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 21, 2024
    10:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్ నిర్వహణపై ఇంకా అనుమానాలు నెలకొని ఉన్నాయి.

    పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ ఐసీసీ టోర్నీకి భారత్ రావడం కష్టమే. అయితే పాకిస్థాన్ మాత్రం తమ వద్దే ఈ టోర్నీని నిర్వహిస్తామని పేర్కొంది.

    ఈ నేపథ్యంలో బీసీసీఐ ముందుకు వచ్చిన పీసీబీ ప్రతిపాదనను గట్టిగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో భారత జట్టు ఉండేందుకు బీసీసీఐ అంగీకరించటం లేదు.

    ఈ క్రమంలో భారత్ తన మ్యాచ్ ముగిసిన వెంటనే దిల్లీ లేదా చండీగఢ్‌కు వెళ్లాలని పీసీబీ ప్రతిపాదన పెట్టినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.

    అయితే బీసీసీఐ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో అడుగు పెట్టే దిశగా అంగీకారం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

    Details

    2008 తర్వాత పాక్ లో పర్యటించని భారత్

    బీసీసీఐ వర్గాలు పీసీబీ నుంచి అలాంటి ప్రతిపాదన రాలేదని కూడా చెబుతున్నాయి.

    భారత్ పాకిస్థాన్ వెళ్లాలా లేదా అన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడుతుందని స్పష్టం చేశాయి. మరోవైపు పాకిస్థాన్ కూడా భారత్ రాకకు సన్నద్ధమైందని కథనాలు వస్తున్నాయి.

    దీంతో ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ ఆడే మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో కాకుండా తటస్థ వేదికలపై జరుగుతాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నాయి.

    ముంబయి ఉగ్రదాడి జరిగిన 2008 తర్వాత, టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఇరు జట్లు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.

    ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఫైనల్‌కు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    ఐసీసీ

    తాజా

    Pm Modi: భారత సైనిక పరాక్రమం త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Cockroaches and Lizards: బొద్దింకలు, బల్లుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?.. ఐతే ఈ సులభమైన పద్ధతితో చెక్ పెట్టండి..! జీవనశైలి
    Amazon Prime Video: ప్రైమ్ వీడియోలో ప్రకటనలు వద్దనుకుంటే.. అదనపు చార్జ్ తప్పదు! అమెజాన్ ప్రైమ్
    Donald Trump: ట్రంప్‌నకు ఖతార్‌ రాజకుటుంబం విమానం గిఫ్ట్‌..! డొనాల్డ్ ట్రంప్

    బీసీసీఐ

    Rohit Sharma: రోహిత్ శర్మ అడుగులు ఎటు.. కీలక నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ..? రోహిత్ శర్మ
    Rahul Dravid : రాహుల్ ద్రావిడ్‌కు బంపరాఫర్ ఇచ్చిన బీసీసీఐ.. కాంట్రాక్ట్ గడువు పొడగింపు..!  రాహుల్ ద్రావిడ్
    బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన ఆశిష్ నెహ్రా.. టీమిండియా కోచ్‌ ఎవరంటే? రాహుల్ ద్రావిడ్
    Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే?  విరాట్ కోహ్లీ

    ఐసీసీ

    భారత్‌లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుక‌లు ఎక్కడో తెలుసా? క్రికెట్
    మాకు ఆడేందుకు అవకాశం ఇవ్వండి.. తాలిబాన్ నిషేధం తర్వాత ఆప్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల అవేదన తాలిబాన్
    World Cup 2023: వన్డే ప్రపంచ కప్ మ్యాచులకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ.. రిఫరీగా భారత మాజీ పేసర్  వన్డే వరల్డ్ కప్ 2023
    WORLD NO.1 INDIA : ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా భారత్ .. కీలకంగా మారనున్న ఆస్ట్రేలియా సిరీస్   టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025