NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / RCB vs GT: హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ గెలిచేనా? గుజరాత్‌తో రసవత్తర పోరుకు సిద్ధం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    RCB vs GT: హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ గెలిచేనా? గుజరాత్‌తో రసవత్తర పోరుకు సిద్ధం!
    హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ గెలిచేనా? గుజరాత్‌తో రసవత్తర పోరుకు సిద్ధం!

    RCB vs GT: హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ గెలిచేనా? గుజరాత్‌తో రసవత్తర పోరుకు సిద్ధం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 02, 2025
    12:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇవాళ తలపడనున్నాయి.

    వరుసగా రెండు మ్యాచ్‌లు బయటి మైదానాల్లో ఆడిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్ మాత్రం తన హోం గ్రౌండ్‌ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది.

    వరుస విజయాలతో హోరాహోరీగా దూసుకెళ్తున్న ఆర్సీబీ, గుజరాత్‌పై విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని భావిస్తోంది.

    బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఐపీఎల్ 2025 14వ మ్యాచ్ జరగనుంది.

    ఆర్సీబీ-గుజరాత్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

    ఈ మ్యాచ్‌ను జియో సినిమాస్, హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో లైవ్‌ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు.

    Details

    హెడ్ టు హెడ్ రికార్డ్స్ 

    ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇప్పటి వరకు కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి.

    అందులో ఆర్సీబీ మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది, గుజరాత్ టైటాన్స్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. వీరి మధ్య చివరగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

    చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు రికార్డు

    బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ 91 మ్యాచ్‌లు ఆడింది.

    అందులో 43 విజయాలు సాధించగా, 43 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ టై కాగా, మరో నాలుగు మ్యాచ్‌లకు ఫలితం తేలలేదు.

    Details

     ఆర్సీబీ vs గుజరాత్ మోస్ట్ రన్స్ 

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లి అత్యధిక పరుగులు చేశాడు.

    విరాట్ కోహ్లి ఐదు ఇన్నింగ్స్‌ల్లో 344 పరుగులు, ఫాఫ్ డుప్లెసిస్ 160 పరుగులు, శుభమన్ గిల్ 154 పరుగులు చేశారు.

    బౌలింగ్ విభాగంలో ఒకప్పటి ఆర్సీబీ బౌలర్, ప్రస్తుత గుజరాత్ పేసర్ అయిన మహ్మద్ సిరాజ్ మెరుగైన రికార్డును కలిగి ఉన్నాడు.

    మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు, నూర్ అహ్మద్ 4 వికెట్లు, రషీద్ ఖాన్ 4 వికెట్లు తీశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    గుజరాత్ టైటాన్స్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..? క్రికెట్
    ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బెన్ సాయర్ క్రికెట్
    WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ ఐపీఎల్
    WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    గుజరాత్ టైటాన్స్

    ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న హార్ధిక్ పాండ్యా ఐపీఎల్
    IPL 2023: గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్‌జెయింట్స్
    IPL 2023: విజృంభించిన లక్నో బౌలర్లు.. స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన గుజరాత్  ఐపీఎల్
    IPL 2023: రసవత్త పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం లక్నో సూపర్‌జెయింట్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025