NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Wtc 2023 -25: టెస్ట్ ర్యాంకింగ్స్‌ టాప్‌లో పాకిస్థాన్.. రెండో స్థానంలో భారత్
    తదుపరి వార్తా కథనం
    Wtc 2023 -25: టెస్ట్ ర్యాంకింగ్స్‌ టాప్‌లో పాకిస్థాన్.. రెండో స్థానంలో భారత్
    డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో రెండో స్థానానికి దిగజారిన టీమిండియా

    Wtc 2023 -25: టెస్ట్ ర్యాంకింగ్స్‌ టాప్‌లో పాకిస్థాన్.. రెండో స్థానంలో భారత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 25, 2023
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా గెలుపు ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు.

    వర్షం కారణంగా రెండో టెస్టు డ్రాగా ముగియడంతో 2023-25 డబ్ల్యూటీసీ సీజన్‌ పాయింట్ల టేబుల్లో ఇండియా రెండో స్థానానికి పడిపోయింది.

    ఇక పాకిస్థాన్ జట్టు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.

    ప్రస్తుతం శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడుతున్న పాకిస్థాన్ తొలి టెస్టులో విజయం సాధించింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ కు చేరింది.

    టీమిండియా ఈ ఏడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

    Details

    డిసెంబరులో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడనున్న భారత్

    కొత్త డబ్ల్యూటీసీ సీజన్ లో భారత్ ఇప్పటివరకూ రెండు టెస్టులు ఆడగా, ఒక మ్యాచులో విజయం సాధించింది. ప్రస్తుతం పాకిస్తాన్ కు 12 పాయింట్ల, ఇండియా 16 పాయింట్లతో నిలిచింది.

    ఇక యాషెస్ సిరీస్‌తో డబ్ల్యూటీసీ 2023-25 షెడ్యూల్ మొదలైంది. ఇందులో అన్ని దేశాలు కలిపి 69 మ్యాచులు ఆడనున్నాయి. ఈ షెడ్యూల్‌లో ప్రతి జట్టు ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ రెండేళ్ల షెడ్యూల్‌లో టీమిండియా 20 టెస్టు మ్యాచులను ఆడనుంది.

    వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ముగిసింది. ఇక టీమిండియా మళ్లీ డిసెంబరులో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడనుంది.

    డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ 3, 4 స్థానాల్లో నిలవడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    పాకిస్థాన్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    టీమిండియా

    Ind vs Ban Women's T20: హాఫ్ సెంచరీతో చెలరేగిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా ఘన విజయం హర్మన్‌ప్రీత్ కౌర్
    అరుదైన రికార్డుకు చేరువలో భారత్ vs వెస్టిండీస్ టెస్టు సిరీస్ వెస్టిండీస్
    దాయాది జట్లపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. సెమీస్‌లో తలపడాలని ఆకాంక్ష పాకిస్థాన్
    కరేబియన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ కు సవాల్.. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం క్రికెట్

    పాకిస్థాన్

    మే9 హింసకాండ నిందితులను వదలబోం: ఆర్మీ చీఫ్ అంతర్జాతీయం
    VIDEO: పాకిస్థాన్ ఆటగాడు స్టంపౌట్.. నవ్వుకున్న నెటిజన్లు క్రికెట్
    వన్డే వరల్డ్ 2023లో మరో కొత్త ట్విస్ట్.. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడలేమన్న పాకిస్థాన్ క్రికెట్
    బిపోర్‌జాయ్ సైక్లోన్ ఎఫెక్ట్: పాకిస్థాన్‌లో భారీ వర్షాలతో 25మంది మృతి  తుపాను
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025