ఈ శతాబ్దం మనందరిది, పరస్పర సహకారంతోనే వృద్ధి, అభివృద్ధి - ప్రధాని మోదీ
ఇండోనేషియాలోని జకర్తాలో జరిగిన ఆసియాన్ భారత్, తూర్పు ఆసియా సదస్సు ముగిసింది. ఆసియాన్ దేశాలు పరస్పరం సహకారించుకోవాలని, దక్షిణాది దేశాల వాణిని మరింత బలంగా వినిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇండో పసిఫిక్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం మరింత కొనసాగాలని మోదీ అన్నారు. ఆసియాన్ దేశాలు మానవాభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. వృద్ధికి కేంద్రాలైన ఆసియాన్ దేశాలు, ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ మేరకు 21 శతాబ్దాన్ని ఆసియాన్ శతాబ్దంగా అభివర్ణించారు. ఇది మనందరి శతాబ్దమని స్పష్టం చేశారు. ప్రపంచదేశాల్లో అనిశ్చితి నెలకొన్నా, ఆసియాన్లు మాత్రం పరస్పర సహకారంతో స్థిరమైన పురోగతి సాధిస్తున్నారన్నారు. భారత ఈస్ట్ యాక్ట్ విధానానికి మూల స్తంభంగా ఆసియాన్ ఉందన్నారు.
ఇండినేషియా పర్యటన ఫలవంతం: నరేంద్ర మోదీ
నాలుగో దశాబ్దంలోకి అడుగుపెట్టిన ఆసియాన్-భారత్ భాగస్వామ్యం
ఆసియాన్-భారత్ భాగస్వామ్యం నాలుగో దశాబ్దంలోకి ప్రవేశించిందని సదస్సులో భాగంగా ప్రధాని మోదీ చెప్పారు. సౌత్ ఈస్ట్ దేశాల అసోసియేషన్ (ఆసియాన్) అత్యంత ప్రభావవంతమైన గ్రూపుల్లో ఒకటిగా పరిగణించవచ్చని మోదీ అన్నారు. ఆసియాన్లో భారత్ సహా అగ్రరాజ్యం అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియాలు భాగస్వామ్యమయ్యాయి. 20వ ఆసియాన్-భారత్, 18వ తూర్పు ఆసియా సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటించారు. అక్కడి ప్రవాస భారతీయలు విమానాశ్రయంలోనే ఘన స్వాగతం పలికారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోపికల వేషధారణలో మోదీకి స్వాగతం అందించారు. ఈ క్రమంలోనే ప్రవాసీలతో మోదీ కాసేపు ముచ్చటించి సదస్సు వేదిక వద్దకు బయల్దేరారు. ఆసియాన్-ఇండియా, తూర్పు ఆసియా సదస్సులను విజయవంతంగా ముగించుకున్న మోదీ, గురువారం మధ్యాహ్నం భారత్ కు పయనమయ్యారు.