NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan - Bangladesh: 53 ఏళ్ల తర్వాత పాక్-బంగ్లా మధ్య ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pakistan - Bangladesh: 53 ఏళ్ల తర్వాత పాక్-బంగ్లా మధ్య ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభం
    53 ఏళ్ల తర్వాత పాక్-బంగ్లా మధ్య ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభం

    Pakistan - Bangladesh: 53 ఏళ్ల తర్వాత పాక్-బంగ్లా మధ్య ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 23, 2025
    04:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత, బంగ్లాదేశ్‌ విదేశాంగ విధానంలో యూనస్‌ నేతృత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

    భారత్‌కు దూరంగా ఉంటూ, పాకిస్థాన్‌ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ పరిణామాల మధ్య, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి.

    1971లో విడిపోయిన తర్వాత తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్యం పునఃప్రారంభమైంది.

    ప్రభుత్వం ఆమోదించిన తొలి కార్గో నౌక కరాచీలోని పోర్ట్ ఖాసిమ్ నుంచి ఢాకాకు బయలుదేరినట్లు పలు మీడియా వర్గాలు వెల్లడించాయి.

    Details

    50,000 టన్నుల బియ్యం ఒప్పందం 

    ఫిబ్రవరి ప్రారంభంలో ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్ 50,000 టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించడంతో ఈ ఒప్పందం ఖరారు అయినట్లు తెలుస్తోంది.

    1971 తర్వాత మొదటిసారిగా పాకిస్థాన్‌ నేషనల్‌ షిప్పింగ్ కార్పొరేషన్ నౌక బంగ్లాదేశ్ ఓడరేవుకు ప్రభుత్వ సరుకును తీసుకెళ్తోంది.

    ఇది ఇరుదేశాల మధ్య సముద్ర వాణిజ్య సంబంధాల్లో ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది.

    మొదటి విడతలో 25,000 టన్నుల బియ్యం తరలించగా, మరో 25,000 టన్నుల బియ్యాన్ని మార్చి ప్రారంభంలో రవాణా చేయనున్నట్లు వెల్లడించింది.

    Details

     పాక్‌ నుంచి బంగ్లాదేశ్‌కు నేరుగా రవాణా 

    గతేడాది డిసెంబర్‌లో 53 ఏళ్లలో తొలిసారిగా పాకిస్థాన్‌ నుంచి నేరుగా బంగ్లాదేశ్‌కు కార్గో షిప్‌ వచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

    పనామా జెండాతో ఉన్న ఆ నౌక 811 కంటైనర్లలో సోడాయాష్, మార్బుల్‌ బ్లాక్, ముడివస్త్రాలు, చక్కెర, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మోసుకొచ్చిందని వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

    1971 తర్వాత తొలిసారి ప్రత్యక్ష వాణిజ్యం

    1971లో తూర్పు పాకిస్థాన్‌ నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు లేవు.

    ఇన్నేళ్ల అనంతరం జరుగుతున్న తాజా వాణిజ్య ఒప్పందాలు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రత్యక్ష రవాణా మార్గాలను సులభతరం చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్
    పాకిస్థాన్

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    బంగ్లాదేశ్

    ISKCON: 'ఇస్కాన్‌'పై నిషేధం విధించేందుకు నిరాకరించిన బంగ్లా కోర్టు!  ఇస్కాన్
    Temples Vandalized: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై రాళ్ల దాడి.. నిరసన వ్యక్తం చేసిన హిందువులు ప్రపంచం
    Kolkata: కోల్‌కతా ఆసుపత్రి కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్ రోగులకు చికిత్స ఇవ్వమని ప్రకటన కోల్‌కతా
    Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం.. మరో 2 ఇస్కాన్ పూజారులు "మిస్సింగ్ " ఇస్కాన్

    పాకిస్థాన్

    Pakistan: : పాకిస్తాన్లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. అమెరికా పౌరులకు ఆ దేశ అడ్వైజరీ హెచ్చరికలు.. అమెరికా
    Champions Trophy: ఒకసారి ICC చైర్మన్ గా జేషా బాధ్యతలు స్వీకరిస్తే..: ఛాంపియన్స్ ట్రోఫీ డెడ్‌లాక్‌పై పీసీబీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు క్రీడలు
    Champions Trophy 2025: పీసీబీ నిర్ణయంపై షాకింగ్ నిజాన్ని వెల్లడించిన షోయబ్ అక్తర్ క్రీడలు
    Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం కష్టమే.. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్‌ కీలక వ్యాఖ్యలు క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025