NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Boycott Turkey: బహిష్కరణ పిలుపుల మధ్య, టర్కీ-అజర్‌బైజాన్ పర్యటనలు రద్దు.. దేశమే ముందంటున్న ఇండియన్స్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Boycott Turkey: బహిష్కరణ పిలుపుల మధ్య, టర్కీ-అజర్‌బైజాన్ పర్యటనలు రద్దు.. దేశమే ముందంటున్న ఇండియన్స్
    బహిష్కరణ పిలుపుల మధ్య, టర్కీ-అజర్‌బైజాన్ పర్యటనలు రద్దు.. దేశమే ముందంటున్న ఇండియన్స్

    Boycott Turkey: బహిష్కరణ పిలుపుల మధ్య, టర్కీ-అజర్‌బైజాన్ పర్యటనలు రద్దు.. దేశమే ముందంటున్న ఇండియన్స్

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 15, 2025
    03:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తూ భారత్‌పై దాడులకు అవసరమైన డ్రోన్లను టర్కీ టర్నీ సంస్థ ద్వారా పంపిణీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

    ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు టర్కీ, అజర్‌బైజాన్ వంటి దేశాలు అండగా నిలవడంపై ప్రస్తుతం భారతదేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది.

    ఈ నేపథ్యంలో భారత్‌లోని పర్యాటకులు తమ టూర్‌లను టర్కీ, అజర్‌బైజాన్‌కు రద్దు చేసుకుంటున్నారు.

    లభించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు సుమారుగా 2వేల మంది భారతీయ పర్యాటకులు టర్కీ, అజర్‌బైజాన్ టూర్‌లను రద్దు చేసుకున్నారు.

    ప్రధానంగా మే నుండి జూలై మధ్య కాలంలో జరగాల్సిన పర్యటనలను ఈ ప్రయాణికులు రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.

    వివరాలు 

    టూర్ల క్యాన్సిలేషన్‌లు 260 శాతం మేర పెరిగింది 

    మొత్తం ప్రయాణికుల్లో దాదాపు 5 శాతం మంది తమ పర్యటనల్ని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది.

    ప్రముఖ ట్రావెల్ సర్వీస్ సంస్థ 'యాత్ర' సీఓఓ మాట్లాడుతూ, ఈ రెండు దేశాలకు సంబంధించిన టూర్ ప్యాకేజీల్లో 50 శాతం వరకు రద్దులు నమోదవుతున్నాయని తెలిపారు.

    అంతేకాకుండా 'క్లియర్ ట్రిప్' సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, టర్కీ, అజర్‌బైజాన్ టూర్ల క్యాన్సిలేషన్‌లు 260 శాతం మేర పెరిగినట్టు పేర్కొన్నారు.

    ఇక మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా తన ఎక్స్ (పూర్వం ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించారు.

    వివరాలు 

    మనదేశంలో కూడా టర్కీ, అజర్‌బైజాన్ కంటే అందమైన ఎన్నో ప్రదేశాలు 

    గత ఏడాది భారత్ నుంచి టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు పర్యాటక రంగం ద్వారా రూ.4,000 కోట్లకు మించిన ఆదాయం లభించిందని, ఇది అక్కడి ఆర్థిక వ్యవస్థ, హోటళ్ల పరిశ్రమ, విమానయాన రంగం సహా అనేక రంగాలకు ఉపాధి కల్పించిందని తెలిపారు.

    కానీ పహల్గామ్ ఘటన అనంతరం ఈ దేశాలు పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన తీరు గమనించదగినదని పేర్కొన్నారు.

    ప్రపంచంలో, అలాగే మనదేశంలో కూడా టర్కీ, అజర్‌బైజాన్ కంటే అందమైన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయని గోయంకా అభిప్రాయపడ్డారు.

    అందుకే ఈ పరిస్థితుల్లో భారత పర్యాటకులు ఈ దేశాలకు వెళ్లే అవసరం లేదని సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాయ్‌కాట్‌ టర్కీ

    తాజా

    Boycott Turkey: బహిష్కరణ పిలుపుల మధ్య, టర్కీ-అజర్‌బైజాన్ పర్యటనలు రద్దు.. దేశమే ముందంటున్న ఇండియన్స్ బాయ్‌కాట్‌ టర్కీ
    Donald Trump: 'భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దు'.. ఆపిల్ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ కీలక భేటీ  డొనాల్డ్ ట్రంప్
    Bank Nomination: బ్యాంకు నామినీ వివరాల్లో ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ వివరాలు తీసుకోవాలని యోచిస్తున్న ఆర్‌బీఐ ఆర్ బి ఐ
    Jungle Safari: పిల్లలతో కలిసి అడవి సఫారీకి వెళ్తున్నారా? ఇలా ప్లాన్ చేస్తే రెండు రెట్లు మజా! వేసవి కాలం

    బాయ్‌కాట్‌ టర్కీ

    Boycott Turkey: ఉద్రిక్తతల నడుమ ఉధృతమైన 'బాయ్‌కాట్ తుర్కియే'  నిరసనలు !  భారతదేశం
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025