
Azerbaijan: భారత్పై తీవ్ర ఆరోపణలు చేసిన అజర్బైజాన్.. ఎస్సీఓలో పూర్తి సభ్యత్వాన్ని భారత్ అడ్డుకుంటోందని ఆరోపణ
ఈ వార్తాకథనం ఏంటి
అజర్బైజాన్ దేశం,భారత్ తమపై ప్రతీకార చర్యలు తీసుకుంటోందని సంచలన ఆరోపణలు చేసింది. పాకిస్థాన్తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా,అంతర్జాతీయ వేదికలపై భారత్ తమను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది. షాంఘై సహకార సంస్థ (SCO)లో అజర్బైజాన్ సభ్యత్వాన్ని భారత్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని స్థానిక మీడియా ప్రచురించింది. ఇటీవల చైనాలోని టియాంజిన్లో జరిగిన సమావేశంలో,పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ కలసి మాట్లాడారు. ఆ సందర్భంగా అలియేవ్ వ్యాఖ్యానిస్తూ,ఈ ఏడాది సైనిక ఘర్షణలో పాకిస్థాన్ విజయం సాధించిందని, ఇస్లామాబాద్కు అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై న్యూఢిల్లీ ఎంత అడ్డంకులు సృష్టించినా,పాకిస్థాన్తో ఉన్న సోదరభావాన్ని తాము మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటామన్నారు. ఈ వ్యాఖ్యలను టర్కీకి చెందిన 'డైలీ సబా' పత్రిక ప్రచురించింది.
వివరాలు
'ఆపరేషన్ సిందూర్' సమయంలో అజర్బైజాన్ బహిరంగంగా పాకిస్థాన్కు మద్దతు
SCOలో అజర్బైజాన్ సభ్యత్వ దరఖాస్తును భారత్ మరోసారి అడ్డుకున్నట్టు 'ఏన్యూజెడ్' స్థానిక టీవీ చానల్ ఆరోపించింది. భారత్ బహుపాక్షిక దౌత్య నియమాలను ఉల్లంఘిస్తున్నట్టు విమర్శలు చేశారు.అలియేవ్,పాకిస్థాన్తో అజర్బైజాన్కు ఉన్న రాజకీయ,సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని,ఇరు దేశాల మధ్య వాణిజ్య,ఆర్థిక సహకారాన్ని పెంచుతామని తెలిపారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విషయం తెలిసిందే. ఆ సమయంలో అజర్బైజాన్ బహిరంగంగా పాకిస్థాన్ కి మద్దతు ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. తర్వాతి కాలంలో పాకిస్థాన్తో రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ భద్రత వంటి రంగాల్లో అజర్బైజాన్ సహకారాన్ని గణనీయంగా పెంచింది.